మోదీతో పోరాడలేకే దోమలతో కుస్తీ | Sakshi
Sakshi News home page

మోదీతో పోరాడలేకే దోమలతో కుస్తీ

Published Mon, Sep 26 2016 12:04 AM

కొల్లాగుంటలో ఫాగింగ్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నారాయణస్వామి - Sakshi

 
కొల్లాగుంట(కార్వేటినగరం) : రాష్ట్ర అభివృద్ధికి సంజీవని అయిన ప్రత్యేక హోదాపై మోదీతో పోరాడలేక చంద్రబాబు దోమలతో కుస్తీపడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి అన్నారు. కొల్లాగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీతో పోరాడి ప్రత్యేక హోదా సాధించలేక ప్రజలను మభ్యపెట్టేందుకు దోమలను చూపుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీపై ఆసక్తి చూపుతున్నారు తప్ప రాష్ట్రాభివృద్ధికికాదని విమర్శించారు. రైతులు పంటల సాగుకు బ్యాంకులపై ఎక్కువ శాతం మంది ఆధారపడుతుంటారు వారికి రుణాలుఇవ్వకుండా చంద్రబాబు ఆంక్షలు వి«ధించి రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రుణాలను మాఫీచేస్తానని చెప్పి నమ్మి ఓట్లు వేసిన రైతులను పూర్తిగా ముంచేసిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వకపోతే కౌలురైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. పంటల సాగుకు రైతులు ప్రయివేటు రుణాలు అధిక వడ్డీలకు తెచ్చుకోవాల్సి వస్తోందని చెప్పారు. అనంతరం కొల్లాగుంట దళితవాడలో దోమల నివారణకు చేపడుతున్న ఫాగింగ్‌«ను పరిశీలించారు.  
 

Advertisement
Advertisement