సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టు సిస్టం ఏర్పాటవుతున్న తొలిన గరంగా హైదరాబాద్కు గుర్తింపు రానుంది. ప్రజా రవాణాలో కీలకంగా ఉన్న ఆర్టీసీ బస్సు ల నిర్వహణను క్రమబద్ధం చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ప్రజా రవాణా వ్యవస్థను గొప్పగా నిర్వహించటంలో ఫ్రాన్స్ దేశానికి మంచి పేరుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లో తొలుత ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే అవకాశాన్ని ఆ దేశానికి చెందిన లూమీప్లాస్ కంపెనీకి అప్పగించారు. గతేడాది అక్టోబర్లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ రమణారావు ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం ఈ మేరకు నగరంలో ఆర్టీసీ బస్సులకు ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టు సిస్టం ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు నగరానికి వచ్చారు. ప్రయోగాత్మకంగా తొలుత ఓ మార్గాన్ని వారికి అప్పగించారు. అక్కడ తమ సాంకేతిక పరిజ్ఞానంతో దాని అమలును పరిశీలిస్తారు. అది సత్ఫలితాలనిస్తే నగరం మొత్తం ఏర్పాటు చేస్తారు.
మొత్తం ఖర్చు ఫ్రాన్స్ కంపెనీదే
ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు కోసం ఉప్పల్–కోఠి మార్గాన్ని ఫ్రెంచి కంపెనీ కి అప్పగించారు. ఆ మార్గంలోని 40 బస్సుల్లో దీన్ని ఏర్పాటు చేసి.. అవి తిరిగే బస్టాప్లతో అనుసంధానిస్తారు. ఇందుకు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని ఫ్రెంచి కంపెనీనే భరి స్తుంది. మరో రెండు నెలల్లో ఈ వ్యవస్థ ప్రారం భమవుతుంది. 6 నెలలపాటు దాని ఫలితాలు పరిశీలిస్తారు. హైదరాబాద్ రోడ్లకు అనుకూలంగా ఉంటే మొత్తం నగరానికి విస్తరి స్తారు. అనుకూలంగా లేనిపక్షంలో.. ప్రయో గం కోసం అయిన ఖర్చుతో ఆర్టీసీకి సంబం ధం ఉండదు. ఇప్పటివరకు దేశంలో ఇలాంటి వ్యవస్థ మరే నగరంలోనూ ఏర్పాటు కాలేదు. దీన్ని మొబైల్ యాప్తో అనుసంధానించి అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు కూడా చేస్తు న్నారు. ఆ యాప్ వల్ల వచ్చే అరగంటలో బస్సుల గమనం కచ్చితంగా తెలుసుకునే అవ కాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.
ఫ్రాన్స్తో కలసి పనిచేస్తాం: మేయర్ బొంతు రామ్మోహన్
హైదరాబాద్లో భూగర్భ పార్కింగ్ ఏర్పా టు, సబ్–వేల నిర్మాణం, గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ల అభివృద్ధికి ఫ్రాన్స్ సహాయం తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. నగరం లో ట్రామ్–వే ఏర్పాటుకు ఫ్రెంచ్ బృందం తో కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వ హిస్తున్న విషయాన్ని మేయర్ రామ్మోహన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఏంటా పరిజ్ఞానం..
భాగ్యనగరంలో 4 వేల సిటీ బస్సులు తిరుగు తున్నాయి. ట్రాఫిక్లో చిక్కుకుని ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియని గందరగోళం నెలకొంది. బస్సు కోసం వేచి చూసి ఎప్పుడొస్తుందో తెలియక ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని నివారించి బస్సుల నిర్వహణను జీపీఎస్ పద్ధతితో క్రమబద్ధం చేయడమే ఈ విధానం. బస్సుల్లో జీపీఎస్ను ఏర్పాటు చేసి.. బస్టాప్లలో అనుసంధాని స్తారు. సౌర శక్తితో పని చేసే డిస్ప్లే బోర్డులను ఏర్పా టు చేస్తారు. ఏ నంబరు బస్సు ఎంత సేపట్లో ఆ బస్టాప్నకు వస్తుందో డిస్ప్లే బోర్డుల్లో కనిపిస్తుంది. ఏ బస్సు ఎక్కడుందో మ్యాప్లో కనిపిస్తుంది. వచ్చే బస్టాప్ పేరు, ఎంత సేపట్లో అక్కడికి బస్సు చేరుకుంటుందనేది బస్సుల్లో ముందుగా ప్రకటి స్తారు. బస్టాప్లలో ఆగకుండా వెళ్లిన బస్సులు, వాటి వేగం, ఎన్ని బస్సులు ట్రాఫిక్లో చిక్కుకుని ఉన్నా యి, ఎన్ని బస్సులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయనే వివరాలన్నీ కంట్రోల్ రూమ్లో తెలిసిపోతాయి.
పరిశీలించిన మంత్రి మహేందర్రెడ్డి
సీఎం చంద్రశేఖర్రావు విశ్వనగర ఆలోచనకు ఇది ప్రతిరూపమని రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి పేర్కొన్నా రు. ఫ్రెంచి కంపెనీ ప్రతినిధులు, ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ ఎంసీ మేయర్ రామ్మోహన్, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర అధికారులతో కలసి బస్భవన్లో ఆయన ఈ విధానాన్ని పరిశీ లించారు. ఏ బస్సు ఎక్కడుంది.. ఎంత సేపటిలో వస్తుంది.. తదితర కచ్చిత వివ రాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, వచ్చే స్టాపుల వివరాలు ముందే తెలుసుకునే అవకాశం కలుగు తుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ఫ్రెంచి ప్రతినిధులు సీఎస్ ఎస్పీ సింగ్కు సచివాలయంలో ఈ విధానం గురించి వివరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు ఇలాంటి విధానం చాలా అవసరమని సీఎస్ అభిప్రాయపడ్డారు.
నగరంలో ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టు సిస్టం!
Published Thu, Jan 26 2017 2:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..
బంగారం స్పీడ్కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
ఓటు వేశారు.. డైమంగ్ రింగ్ గెలుచుకున్నారు!
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
Shivathmika Rajashekar: అదిరే అందాలతో కవ్విస్తోన్న శివాత్మిక (ఫోటోలు)
చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement