► జలసిరి-2 అమలు తీరిదీ..
►10,223 జలసిరి బోర్ల లక్ష్యం
►5,850గుర్తించిన బ్లాక్లు
►1,185నీటి లభ్యత బ్లాక్లు
►106మంజూరు
►74వేసిన బోర్లు
► 39 నీళ్లు పడిన బోర్లు
ఆయకట్టును పెంపొందించే ఉద్దేశంతో అమలు చేస్తున్న జలసిరి పథకం జిల్లాలో చతికిల పడింది. కాలువల్లో నీరు పారకపోయినా పంటలు ఎండిపోకూడదని బోర్లు వేసేందుకు తీసుకున్న నిర్ణయం అపహాస్యమవుతోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.. అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడం వల్ల పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇక బోర్లు వేసే అవకాశం కూడా లేకుండాపోతోంది.
ఆయకట్టు ప్రాంతాల్లో 10,223 బోర్ల తవ్వకానికి అనుమతి లభించింది. ఆయకట్టు ప్రాంతాల్లో రెండు నుంచి మూడెకరాల భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులు. ఆయకట్టు ప్రాంతాల్లోని చివరి భూములకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను జన్మభూమి కమిటీ ఆమోదించాల్సి ఉండగా.. లబ్ధిదారుడు పట్టాదారు పాసు పుస్తకం నకలు, ఆధార్కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్కార్డు అందజేయాలనే నిబంధనలు విధించారు. ప్రభుత్వం బోరు తవ్వుకునేందుకు రూ.1,19,000 ఇస్తుందనే మాటే కానీ.. క్షేత్ర స్థాయిలో సవాలక్ష నిబంధనలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేవలం ఆయకట్టు ప్రాంతాల్లోనే బోరు బావి తవ్వాలనే నిబంధన వల్ల ఈ పథకం లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం.. ప్రభుత్వం నిర్ణీత అడుగుల వరకే డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో పథకం నీరుగారింది.
అదనపు భారం రైతుపైనే..
విద్యుదీకరణ సబ్సిడీ, పంపుసెట్ ఖరీదుపై లబ్ధిదారుడు ఎస్సీ, ఎస్టీలైతే 5శాతం(రూ.4,500), ఇతరులు 20శాతం(రూ.18,000) చెల్లించాలి. విద్యుదీకరణకు రూ.50వేల సబ్సిడీ మినహాయించి మిగిలిన మొత్తమంతా లబ్ధిదారుడే భరించాల్సి వస్తోంది. ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. కేవలం విద్యుదీకరణకే కొందరు రైతులకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వెచ్చిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు అవసరమైన కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ కంటే అధిక కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ను అమరుస్తుండటంతో రైతులపై మరింత భారం పడుతోంది. బోరు బావి తవ్వేందుకు, కేసింగ్ పైపు వేసేందుకు గరిష్టంగా రూ.24వేలు చెల్లిస్తామని చెబుతున్నా, బోరు ఫెయిలైతే మాత్రం కొంత మొత్తాన్ని లబ్ధిదారుడే భరించాల్సి ఉంది. చిన్న, సన్నకారు రైతులు ఆ మొత్తాన్ని వెచ్చించలేక పథకంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
వర్షాకాలంలో బ్రేక్ పడినట్లే..
వర్షాకాలం ప్రారంభం కావడంతో బోరు బావుల తవ్వకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయకట్టు ప్రాంతాల్లోనే బోరుబావులు తవ్వాలనేది పథకంలోని నిబంధన. ఆయకట్టు ప్రాంతాల్లో అధికంగా వరిమళ్లు ఉండటం.. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఆ పొలాల్లోకి వెళ్లేందుకు బోరువెల్ వాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకసారి పొలంలో వాహనం దిగబడిందంటే దానిని బయటకు తీసుకొచ్చేందుకు భారీగా ఖర్చు అవుతుందని జంకుతున్నారు. ఫలితంగా పథకానికి ఈ సీజన్లో బ్రేక్ పడినట్లేననే చర్చ జరుగుతోంది.
జలసిరి.. వర్షార్పణం
Published Sun, Jun 26 2016 8:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement