జన్మభూమి కమిటీలకు మరింత పెత్తనం
ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు పోటీగా ఉంచే యోచన
జేబీ కమిటీల ముందు డమ్మీలుగా మారిన అధికారులు
నేటినుంచి ప్రారంభం కానున్న జన్మభూమి గ్రామసభలు
పలమనేరు: జన్మభూమి కమిటీల పేరిట చంద్రన్న ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తులతో పాలన చేయడానికే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వీరి కారణంగా ప్రభుత్వ పథకాలు అర్హులకు అందకుండా పోతున్నాయి. ఈ కమిటీల ప్రోద్బలంతో అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ అధికారులు పూర్తిగా డమ్మీలుగా మారారు. గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్లకు ఏమాత్రం అధికారాలు లేకుండా చేయడంపై పలమనేరు నియోజకవర్గంలోని సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి పథకానికి కమిటీలే కీలకం
ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమపథకాల అమలులో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా, రాష్ట్ర, ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సుల్లో సైతం అధికారులతో పాటు వీరు పాల్గొంటున్నారు. అధికారులు ప్రభుత్వ పథకాల సమాచారం తదితర వివరాలను వీరికి తప్పకుండా తెలియజేస్తున్నారు. వీరు సిఫారసు చేస్తే గానీ పనులు జరగని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్సిడీ రుణాలకు సంబంధించి అధికారులతో పాటు లబ్ధిదారుల ఎంపికలో వీరిని కూర్చొబెట్టారు.
ఇక రుణమాఫీకి సంబంధించి అర్హులైన వారి విచారణలు, తప్పులు సరిదిద్దుకునే అవకాశంలోనూ వీరిదే హవా. ఇలా ప్రతి అంశంలోనూ జేబీ కమిటీ సభ్యులే కీలకంగా మారారు. నేటినుంచి సాగే జన్మభూమి గ్రామసభల్లో వీరికి మరింత పెత్తనం కట్టబెట్టడం మరింత వివాదంగా మారింది. స్థానికసంస్థల అధికారాలను నిర్వీర్యం చేస్తూ సర్పంచ్ల అధికారాలకు కత్తెర వేయడంపై సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై నేటి నుంచి జరిగే గ్రామసభల్లో వివాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సర్పంచ్ అధికారాలకు తప్పని కత్తెర
Published Mon, Jan 2 2017 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement