'చంద్రబాబు తట్టుకోలేపోతున్నారు' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు తట్టుకోలేపోతున్నారు'

Published Sat, Jul 30 2016 9:27 AM

jogi ramesh takes on chandrababu

విజయవాడ : నగరంలోని వైఎస్ఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గంగా తొలగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. ప్రజల్లో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న విశ్వాసాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు.

శనివారం విజయవాడలో జోగి రమేష్ మాట్లాడుతూ... అధికార బలంతో ప్రజా నేతల విగ్రహాలను తొలగిస్తే... చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్ఆర్ విగ్రహం పట్ల చేసిన అపచారానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చంద్రబాబును జోగి రమేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement
Advertisement