హోదా కోసం ఆగిన మరో గుండె | Sakshi
Sakshi News home page

హోదా కోసం ఆగిన మరో గుండె

Published Thu, Sep 3 2015 11:16 AM

kalluri krishnaiah died with cardiac arrest

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం మరో వ్యక్తి గుండె ఆగింది. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం పున్నేపల్లి గ్రామానికి చెందిన కల్లూరు కృష్ణయ్య అనే వ్యక్తికి గురువారం తీవ్ర గుండెపోటు వచ్చింది.

దాంతో అతడిని ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో అతడు మరణించాడు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందని కృష్ణయ్య భావించాడు. అయితే ఈ అంశంపై కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుంది. దాంతో ఆవేదన చెందిన కృష్ణయ్య ఈ రోజు టీవీ చూస్తూ మరణించాడని తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement