Sakshi News home page

లక్ష్మీపురం కేసీపీ షుగర్స్‌కు జాతీయ భద్రత అవార్డు

Published Fri, Sep 16 2016 10:34 PM

లక్ష్మీపురం కేసీపీ షుగర్స్‌కు జాతీయ భద్రత అవార్డు

 
చల్లపల్లి:
  లక్ష్మీపురం కేసీపీ షుగర్స్‌ కర్మాగారానికి కేంద్ర కార్మిక శాఖ నుంచి జాతీయ ¿¶ ద్రతా అవార్డు లభించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చేతులమీదుగా కేసీపీ లక్ష్మీపురం కర్మాగార ప్రాసెసింగ్‌ మేనేజర్‌ జి.శంకరరావు అందుకున్నారు. కర్మాగారంలో ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకున్నందుకు గాను లక్ష్మీపురం కేసీపీ కర్మాగారానికి స్కీం నెంబరు –3 విభాగంలో విన్నర్‌గా, స్కీం నెంబరు –4లో రన్నర్‌గా బహుమతులు లభించాయి. ఇప్పటికి 11సార్లు ఈ అవార్డులను సాధించింది. ఈ సందర్భంగా కర్మాగార  ఉద్యోగులను  కేసీపీ లక్ష్మీపురం, ఉయ్యూరు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జి.వెంకటేశ్వరరావు అభినందించారు. 
 

Advertisement

What’s your opinion

Advertisement