గర్భిణుల వివరాలు వంద శాతం నమోదు చేయాలి
వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ ఎస్పీ.సింగ్
హాజరైన మూడు జిల్లాల కలెక్టర్లు
హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పేరుతో గర్భిణుల కోసం ప్రత్యేక పథకాన్ని వచ్చే నెల 2నుంచి ప్రవేశపెట్టనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పీ.సింగ్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఈ పథకం అమయ్యేలా గర్భిణుల వివరాలు సేకరించాలని ఆయన సూచించారు. చీఫ్ సెక్రటరీతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కమిషనర్ వాకాటి కరుణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా హన్మకొండలోని అర్బన్ కలెక్టరేట్లో వీసికి వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల కలెక్టర్లు అమ్రపాలి, ప్రశాంత్ జీవన్ పాటిల్, శ్రీదేవసేన హాజరయ్యారు. తొలుత కలెక్టర్లు మాట్లాడుతూ తమ జిల్లాల పరిధిలో గర్భిణుల వివరాలు పూర్తిస్థాయిలో సేకరించామని వివరించారు.
అర్బన్ కలెక్టర్ అమ్రపాలి కాట మట్లాడుతూ జిల్లాలో కేసీఆర్ కిట్ పథకం అమలుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే డాటా ఎంట్రీ పూర్తయిందని తెలిపారు. ఆస్పత్రుల్లో అవరమైన మౌళిక సదుపాయాలు కల్పించా మని వివరించారు. రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 4వేల గర్భిణుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నమోదు చేశామని తెలిపారు. ఏఎన్సీ చెకప్లు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 130 ప్రసవాలు జరిగాయని పేర్కొన్నారు. సీహెచ్సీల్లో డ్యూటీ డాక్టర్ల నియామకాలు చేపట్టాలని, తద్వారా రోగులకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. జనగామ కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన సీహెచ్సీలకు పోస్టులు మంజూరు చేయాలని, మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. తమ జిల్లాలో కేసీఆర్ కిట్ పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రసవాల సంఖ్య పెరగాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పీ.సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా కలెక్టర్లు, వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. శాఖ కమిషనర్ వాకాటి కరుణ మాట్లాడుతూ వైద్యుల పోస్టుల భర్తీకి కొంత సమయం పడుతుందని, ఈలోగా అవసరాలకు అనుగుణంగా పీహెచ్సీ వైద్యులను సీహెచ్సీలకు డిప్యూట్ చేయాలని సూచించారు. అలాగే, ఎన్ఆర్హెచ్ఎం నిధుల నుంచి స్టాఫ్ నర్సులను తీసుకోవాలన్నారు.సమావేశంలో డీఎంహెచ్ఓలు డాక్టర్ హరీష్రాజ్, డాక్టర్ అశోక్ ఆనంద్, డాక్టర్ అన్నప్రసన్న పాల్గొన్నారు.
వచ్చే నెల 2నుంచి ‘కేసీఆర్ కిట్’
Published Tue, May 16 2017 3:52 AM
Related news
-
నేడు ఉమ్మడి మహబూబ్నగర్లో కేసీఆర్ పర్యటన
సాక్షి, మహబూబ్నగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుండి మహబూబ్నగర్ వరకు భారీ రోడ్షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడనున్నారు.రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపనున్నారు. రేపు(శనివారం) నాగర్కర్నూల్కు బస్సు యాత్ర చేరుకోనుంది. నాగర్ కర్నూల్, మహబుబ్ నగర్ అభ్యర్థులకు మద్దుతుగా సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ చేస్తున్నాయి. -
12 లోక్సభ సీట్లు ఇవ్వండి.. ప్రభుత్వం మెడలు వంచుతాం: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా.. ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నా.. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీలన్నీ ఎగబెట్టిందని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ లోక్సభ ఎన్నికల కోసం ప్రజలకు ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు.కాంగ్రెస్ వచ్చాక రైతు బంధులో దగా చేస్తోందని.. రైతుబీమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. కరెంటు సరిగా రావడం లేదని, నీళ్లు అందడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే.. భూమి, ఆకాశం ఒక్కటయ్యేలా ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సుయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలలో నిర్వహించిన రోడ్షోలలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘1956 నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకు శత్రువు. అప్పుడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపి 58 ఏళ్లు గోస పెట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి, బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన çహామీలన్నీ ఎగబెట్టింది. మళ్లీ లోక్సభ ఎన్నికల కోసం ప్రజల ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతాం. హామీలు అమలు చేయించగలుగుతాం. ఆ బాధ్యత నాదే. ప్రజలిచ్చే బలంతోనే పోరాటం చేయగలుతాం. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. కరెంటు సరిగ్గా వస్తుంది. హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు, కాంగ్రెస్కు మధ్య పంచాయితీ వచ్చింది. ఆ పంచాయితీకి ప్రజల తరఫున పెద్ద మనిషిగా నేనుంటా. పంటలు ఎండటం ఇదే మొదటిసారి బీఆర్ఎస్ తొమ్మిళ్ల పాలనలో 18 పంటలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా సాగర్ ఆయకట్టు నీళ్లు ఇచ్చి బంగారు పంటలు పండించాం. ఇప్పుడు నాగార్జున సాగర్లో నీళ్లున్నా, ఇచ్చే అవకాశమున్నా.. కాంగ్రెస్ దద్దమ్మలకు దమ్ములేక, ప్రాజెక్టును తీసుకుపోయి కృష్ణాబోర్డు చేతిలో పెట్టారు. మొత్తం పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చాక పంటలు ఎండిపోవడం ఇదే మొదటిసారి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంట్.. దిగిపోగానే మాయమైపోయిందా? కేసీఆర్ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును నడిపించలేని అసమర్థులు ఈరోజు ఏలుతున్నారు. ఎందుకు చేతనవడం లేదు? ప్రజలను ఎందుకు బాధ పెడుతున్నారు? మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు? ప్రజలకు నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు? రైతులకు అన్యాయం జీవితాన్ని పణంగా పెట్టి, ఆమరణ దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక్కో మెట్టు కట్టుకొంటూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో ప్రజలకు తెలుసు. అలాంటి రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మేం రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా ఏటా 15, 16 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చాం. ఇప్పుడు రైతుబంధు ఐదు ఎకరాలకేనంటూ ఎగబెడుతున్నారు. ఎందుకిలా? రైతులకు ఇవ్వడానికి మీకేం బాధ.అదేమైనా మీ అబ్బ సొత్తా..? రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలి. బీఆర్ఎస్ రెండు దఫాలుగా రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేసి, రైతు లను ఆదుకుంది. ఈరోజున్న సీఎం కొన్ని నెలల కింద పరుగెత్తుకొని వచ్చి డిసెంబరు 9 నాడు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎందుకు చేయలేదు? ఎందుకింత మోసం చేశారు? నన్ను తిట్టినా ఫర్వాలేదు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే నా ప్రాణం పోయినా వదిలిపెట్టబోను. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా. ధాన్యం ఎందుకు కొనడం లేదు? తన బస్సుయాత్ర వచ్చే దారిలో ఆర్జాలబావి వద్ద రైతులు ఆపి గోడు వెళ్లబోసుకున్నారు. ధాన్యం తెచ్చి 25 రోజులు అవుతున్నా కొనడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా? ఒకసారి ప్రధాని మోదీ వడ్లు కొనబోమని మొండికేస్తే ఢిల్లీలో ధర్నా చేసినం. మోదీ మెడలు వంచి, మద్దతు ధరతో తెలంగాణ ధాన్యం కొనేలా చేశాం. ఏపీ నీళ్లు తరలించుకుంటే నోరు మెదపరేం.. నీళ్లు, నిధుల కోసం, కరెంటు కోసం, ప్రజల కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. కేసీఆర్ పక్కకు జరిగిన నాలుగైదు నెలలకే నీళ్లు ఎలా మాయమైపోయాయి? నాలుగైదు నెలల కింద ధీమాతో ఉన్న రైతులు.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఇవాళ మళ్లీ బాధలో పడ్డారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నల్లగొండ జిల్లాలోనే ఉన్నా దద్దమ్మలాగా.. నాగార్జునసాగర్ డ్యామ్పై అధికారాన్ని కేంద్రానికి అప్పజెప్పారు. నీళ్లివ్వడం చేతనైతలేదా? సాగర్ టెయిల్ పాండ్ నుంచి 5 టీఎంసీల నీళ్లను ఏపీ వాళ్లు తీసుకెళ్లారు. అయినా మంత్రి ఉత్తమ్ నోరు మెదపకుండా ఎక్కడ పడుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే 60–70 టీఎంసీల నీళ్లను వదిలేసి రాకుండా చేశారు. తులం బంగారం ఏమైంది? మా హయాంలో రూ.200 పెన్షన్ను రూ.2 వేలు చేసుకున్నాం. దళిత బిడ్డలను లక్షాధికారులను చేసేందుకు దళితబంధు అమలు చేశాం. పేదబిడ్డలకు పెళ్లి చేయాలని రూ.లక్ష ఇచ్చేలా కల్యాణలక్ష్మి పెట్టాం. కాంగ్రెస్ వాళ్లు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదు? పెన్షన్లను రూ.4వేలకు పెంచుతామన్న హామీ ఏమైంది? నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఏమైంది?’’అని కేసీఆర్ నిలదీశారు. కేసీఆర్ కాన్వాయ్లో వాహనాలు ఢీ మిర్యాలగూడ టౌన్: కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా మిర్యాలగూడలో రోడ్ షోకు వెళ్తుండగా.. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొకటిగా వరుసగా 10 వాహనాలు ఢీకొన్నాయి. ఆ వాహనాల ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.కేసీఆర్ భయపడతడా? ‘‘నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో 225 మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారు. గురుకులాల్లో తిండి సరిగా పెట్టడం లేదు. 135 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై.. నలుగురు ఐదుగురు చనిపోయారు. దానిపై ప్రశ్నిస్తే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జైల్లో వేస్తామంటున్నారు. కేసీఆర్ భయపడతాడా? అలా భయపడితే తెలంగాణ వచ్చేదా? పేగులు తీసి మెడలేసుకుంటం, గుడ్లు తీసి గోలీలాడుతం, పండబెట్టి తొక్కుతం అంటూ సీఎం మాట్లాడుతున్నారు. కేసీఆర్ చెడ్డీ ఊడబీకుతామంటున్నారు. నా చెడ్డీతో ఏం చేసుకుంటారు? ఒక మాజీ సీఎంను టార్గెట్ చేసే విధానం ఇదేనా? 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడుతారా? ప్రజలు ఆలోచించాలి’’ తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. లోక్సభ ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ప్రారంభించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర బుధవారం మధ్యాహ్నం మొదలైంది. ఒంటి గంట సమయంలో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు కేసీఆర్ చేరుకున్నారు. పార్టీ మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం ప్రత్యేక బస్సులో, కాన్వాయ్తో బయలుదేరారు. ఇన్నాళ్లూ తెలంగాణ భవన్ దక్షిణ గేటు నుంచి రాకపోకలు సాగించిన కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈశాన్య ద్వారం నుంచి బస్సు యాత్రకు బయలుదేరారు.మార్గమధ్యలో ఆయా ప్రాంతాల్లో వేచి ఉన్న పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. నల్లగొండ పట్టణ శివారులోని అన్నెపర్తి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. తర్వాత ఆర్జాలబావి వద్ద కూడా రైతులతో మాట్లాడి.. వారి బాధలను తెలుసుకున్నారు. మాడ్గులపల్లిలోని ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. తర్వాత మిర్యాలగూ డ, సూర్యాపేట రోడ్ షోలలో ప్రసంగించారు. రాత్రి సూర్యాపేటలోని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బస చేశారు. నేడు భువనగిరిలో రోడ్ షో బస్సుయాత్రలో భాగంగా రెండో రోజు గురువారం సాయంత్రం వరకు కేసీఆర్ సూర్యాపేటలోనే ఉండనున్నారు. నల్లగొండ, భువనగిరి లోక్సభ సెగ్మెంట్ల నేతలతో ప్రచార సరళిని సమీక్షించనున్నారు. సాయంత్రం భువనగిరిలో నిర్వహించే రోడ్ షోలో ప్రసంగిస్తారు. మొత్తంగా మే 10వ తేదీ వరకు 17 రోజుల పాటు 12 లోక్సభ నియోజకవర్గాల మీదుగా కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. రైతులతో కేసీఆర్ మాటా మంతీ నల్లగొండ రూరల్: కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా నల్లగొండ మండలం అన్నెపర్తి, ఆర్జాలబావి గ్రామాల వద్ద రైతులతో మాట్లాడారు. అన్నెపర్తి వద్ద.. రైతు వెంకన్న: రైతుల పరిస్థితి ఆగమాగం ఉంది సార్.. కేసీఆర్: ఎందుకు.. ఏమైంది? రైతు: మీరు దిగిపోయారు. వానలు లేవు. వడ్లకు బోనస్ లేదు, రుణమాఫీ చెయ్యలేదు. కేసీఆర్: ఇటు రాండ్రి.. బాగున్నారా.. (మాజీ సర్పంచ్ అరవింద్రెడ్డి, మాజీ ఎంçపీటీసీ ఆండాలు, గట్టయ్యలను పిలిచారు) మాజీ ప్రజాప్రతినిధులు: బాగున్నాం సార్. ఐకేపీ సెంటర్లో బాధలు చూడాలి సార్. కేసీఆర్: ఎలాంటి సమస్య ఉన్నా పోరాడుదాం. ఏదైనా ఉంటే భూపాల్రెడ్డి (నల్లగొండ మాజీ ఎమ్మెల్యే), కృష్ణారెడ్డి (బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి)కి చెప్పండి. దాన్ని తీర్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఆర్జాలబావి వద్ద.. రైతు గుండగోని పాపయ్య: సార్, మీ పాలనే బాగుండే. 20 రోజులైంది ధాన్యం తూకం కాలేదు. బోనస్ లేదు. రుణమాఫీలేదు. చెరువుల్లో నీళ్లు లేవు.. సక్రమంగా కరెంటు లేదు. రైతు బంధు రాలే. మళ్లీ మీరే రావాలి సార్. కేసీఆర్: ధాన్యం కొంటలేరా? రైతు: కొంటలేరు సార్. ఎండకు చస్తున్నాం. కేసీఆర్: అందరూ రెడీగా ఉండండి.. పోరాటం చేద్దాం.. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చరో చూద్దాం. -
బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పవర్ విషయంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న ఉత్తమ్.. సీఆర్కు పార్టీ మిగలదన్న భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్లో ఎవరూ ఉండరంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనమరుగవుతుందన్నారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చెప్పేవనీ అసత్యాలేనని ఉత్తమ్ అన్నారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయింది.. దానికి కరెంటు పోయిందని కేసీఆర్ అబద్దం చెప్పారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారం. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదు.. గత పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇరిగేషన్పై మాట్లాడే అర్హత కేసీఆర్కి లేదు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తామని కేసీఆర్ ఒప్పుకున్నారు. కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారు’’ అంటూ ఉత్తమ్కుమార్రెడ్డి దుయ్యబట్టారు. -
కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేసీఆర్
ఇది పాలకుల అసమర్థత కాదా? రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు? కేసీఆర్ గడప దాటగానే కట్టేసినట్టుగా బంద్ అవుతదా? ఇది పాలకుల అసమర్థత కాదా? ఆలోచించాలి. మేం టెక్నోక్రాట్లను పెట్టి విద్యుత్ శాఖను నడిపాం. ఎలా బాగా నడపవచ్చో వారికి తెలుసు కాబట్టే సమర్థంగా నడిచింది. ఇప్పుడు ఐఏఎస్ను నియమించారు. వారికి విషయం పట్టుబడదు.. మంత్రులు పట్టించుకోరు. తీరిక లేదు. ఈ పాలకులకు రాజకీయాల కోసం తీరిక ఉందిగానీ.. ప్రజల కోసం తీరిక లేదు. సీఎం ఎక్కడ పడుకున్నరు? గత డిసెంబర్ 9వ తేదీనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తమన్నరు. డిసెంబర్ 9 పోయి ఎన్నాళ్లయింది? నాలుగు నెలలు అవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడున్నరు? ఎక్కడ పడుకున్నరు? మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు. మేం వెంటపడి తరుముతాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా విడిచిపెట్టేది లేదు. కేవలం 1.8 శాతం ఓట్లతో గెలిచావు. మిమ్మల్ని తరిమికొడతాం. నిద్రపోనియ్యం. వెంటనే రుణమాఫీ చేసి తీరాల్సిందే. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అసమర్థ, తెలివిలేని, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆరోపించారు. ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్ తెచ్చిన కరువని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వెంటాడి, వేటాడుతామన్నారు. ధర్నాలు చేస్తామని.. అవసరమైతే ఎక్కడికక్కడ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వరికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏప్రిల్ 2, 6 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రెస్మీట్లో కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించా. చాలాచోట్ల రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోయామని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి పరిహారం ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తామంటేనే నమ్మి పంటలు వేశామని.. మొదటే ఇవ్వబోమని చెప్పి ఉంటే వేసుకునే వాళ్లం కాదని వాపోయారు. ప్రభుత్వం మొదట ఇచ్చి తర్వాత బంద్ చేసి నష్టం చేకూర్చిందని బాధపడ్డారు. మేం ఏడెనిమిదేళ్లలో వ్యవసాయ స్థిరీకరణతో, స్పష్టమైన విధానాలతో రైతులు బాగుపడేలా చేశాం. ఇన్నాళ్లూ ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణలో వంద రోజుల్లోనే దుర్భరమైన పరిస్థితిని చూస్తామనుకోలేదు. రైతులు ఇంతగా ఏడ్చే పరిస్థితి వస్తుందనుకోలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దుస్థితి రాష్ట్రంలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తం.. మేం రూ.35వేల కోట్లు వెచ్చించి అగ్రగామిగా నిలిపిన విద్యుత్ రంగం.. వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు మారింది? ఉన్న వ్యవస్థను ఉన్నట్టు నడిపించలేని ఈ అసమర్థత ఏందీ? ఉన్న దాన్ని ఉన్నట్టు నడిపించే తెలివిలేకపోతే ఎలా? ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ, ప్రభుత్వ అసమర్థత, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యమే. మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నయ్. మళ్లీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మేం పవర్గ్రిడ్కు అనుసంధానించి.. కరెంట్ సరఫరాలో ఇబ్బంది ఏర్పడిన సమయంలో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ తీసుకునే విధంగా చేశాం. 7వేల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీని 18 వేల మెగావాట్లకు పెంచాం. అదనంగా 1,600 రామగుండంలో, 4 వేలు యాదాద్రి థర్మల్ స్టేషన్లో కలిపి 5,600 మెగావాట్లు అదనంగా వచ్చే పరిస్థితి కల్పించాం. ఈ ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్ను పట్టించుకోవడం లేదు. పట్టించుకుని ఉంటే రెండు యూనిట్ల ద్వారా సొంతంగా మరో 1,500 మెగావాట్లు వచ్చేది. ఇంత ఉజ్వలమైన పవర్ సిస్టం ఉన్నా ఎందుకు ఇబ్బంది అవుతోంది? అవసరమైనప్పుడు కరెంటు కొనాలె.. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైతే ప్రభుత్వం అప్పులు చేయాలె. పీక్ అవర్స్లో ఎంత షార్టేజ్ ఉంటే అంత కరెంటు కొనాలి. రైతులకు ఇవ్వాలి. మేం అదే చేశాం. అందుకే ఆనాడు రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. మేం ఉన్నప్పటికంటే ఇప్పుడు లోడ్ ఐదారు వందల మెగావాట్లు డిమాండ్ పెరిగింది. కానీ ప్రభుత్వం అవసరమైనంత కొంటలేదు. అందుకే కరెంటు వస్తలేదు. ఎనిమిదేళ్లుగా కాలిపోని మోటార్లు ఇప్పుడు కాలిపోతున్నాయని చాలా మంది రైతులు చెప్పారు. రోజుకు ఆరేడుసార్లు వస్తోంది, పోతోంది. అయినా సర్కారుకు చీమ కుట్టినట్టు లేదు. మేం రైతుల గురించి రూ.20, 30 వేల కోట్లు అయినా పెట్టాం. గట్టిగా పంటలు పండితే అవి నాలుగేళ్లలో తీరిపోయాయి. పంటలు ఎందుకు ఎండుతున్నాయి రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లానే లేదు. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 3.5 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల్లో పంట ఎండింది. ప్రతి ఊళ్లో 200 నుంచి 400 ఎకరాల దాకా ఎండిపోతోంది. సాగర్ ఆయకట్టు ఎందుకు ఎండుతోంది? ఈ రోజు కూడా సాగర్లో మినిమమ్ డ్రాడౌన్ లెవల్ (ఎండీడీఎల్) కంటే పైన 7 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కింద మరో ఏడెనిమిది టీఎంసీలు వాడుకోవచ్చు. అంటే 14, 15 టీఎంసీల నీళ్లు వాడుకునే పరిస్థితి ఉంది. కానీ తెలివి హీనంగా సాగర్ ప్రాజెక్టును కృష్ణాబోర్డుకు అప్పగించి, సాగర్ కట్టమీదకు వెళ్లలేని దుస్థితిని తీసుకొచ్చారు. ప్రభుత్వం మెడలు వంచుతాం ఖమ్మం, మహబూబ్నగర్, ఇతర జిల్లాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. రూ.500 కోట్లను రైతులకు అందించాం. అప్పుడు అది సరిపోదని, రూ.20 వేల చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే వడగళ్ల వాన పడి నష్టపోతే అడిగే దిక్కులేదు. అకాల వర్షాలతో లక్ష ఎకరాల్లో పంట దెబ్బతిన్నా.. మాట్లాడేవాళ్లు లేరు. మంత్రి పోడు, ఎమ్మెల్యే పోడు.. ఎంపీలు పోరు, అధికారుల బృందాలు పోవు.. దొంగల్లా ముఖం చాటేస్తారు. ముఖ్యమంత్రికి పట్టింపే లేదు. ఆయనకు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి.. ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోయాయి కాబట్టి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఏయే జిల్లాల్లో, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతెంత పంట ఎండిపోయిందనే లెక్కలు తీయాలి. ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి. పరిహారం ఇచ్చే దాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తాం. ఎక్కడికక్కడ మంత్రులు, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి. కచ్చితంగా లెక్కలు తీస్తాం. మిమ్మల్ని బజారుకీడుస్తాం. హామీ ఇచ్చినట్టుగా వరికి రూ.500 బోనస్ కూడా ఇవ్వాలి. ఇందుకోసం కోసం ఏప్రిల్ 2న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తాం. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యేలు, మేము ఇస్తాం. 6వ తేదీన నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేస్తాం. కళ్లాల వద్ద నిలదీస్తాం. ఆత్మహత్యలు చేసుకోవద్దు నేను రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నా.. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం బీఆర్ఎస్ పార్టీ రణరంగమైనా సృష్టిస్తది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాకు బాధ్యత ఇచ్చారు. మీ తరపున పోరాడుతాం. నేను మీ వెంటే ఉంటా. హక్కులను సాధించుకుందాం..’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు చిల్లర రాజకీయాలతో కాళేశ్వరంలోని నీళ్లను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీల్లో నీటిని వదిలిపెట్టి, సీపేజీలో పోయే నీటిని ఫొటోలు తీసి, వీడియోలు తీసి, ప్రాజెక్టు ఖతం అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు. నిన్న యూపీలోనో, బిహార్లోనో బ్రిడ్జి కూలిపోయింది. ప్రపంచం మునిగిపోయిందా? మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాట్లాడుతున్నరు. నాగార్జునసాగర్ కుడివైపు కుంగలేదా? పునరుద్ధరించలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? అమెరికాలో ఓ డ్యాం నాలుగుసార్లు కొట్టుకుపోయింది. వారు విడిచిపెట్టారా? కొందరు ఇంజనీర్ల తప్పువల్లనో, అనుకోకుండా ఏర్పడిన సమస్యతోనో, జియాలజీ సమస్యతోనో ఓ పిల్లర్ కింద ఇసుక కొట్టుకపోతే.. ప్రపంచం బద్ధలైనట్టు, ప్రళయం వచ్చినట్టు చిల్లర కథలు చెప్పి నీళ్లివ్వడం లేదు. మరి సమ్మక్క బ్యారేజీకి ఏమైంది. దేవాదుల నుంచి ఎందుకు పంప్ చేయట్లేదు. ఒక్కసారిగా నీళ్ల కొరత ఎందుకు వచ్చింది? ప్రపంచ దేశాలు కొనియాడిన మిషన్ భగీరథ ఉండగా ఎందుకు మంచి నీళ్ల కొరత వచ్చింది? ఐదేళ్లు బ్రహా్మండంగా నడిచిన పథకంలో ఎందుకు లోపం వస్తుంది? ఎందుకు ఇప్పుడు బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్? ఎందుకు నీటి సమస్య వస్తోంది. హైదరాబాద్ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుంది? ఇందుకు కారణం సీఎం, మంత్రులే. రాష్ట్రంలో ఏం జరుగుతోందనే సమీక్ష చేయడం లేదు. వారికి పట్టింపు లేదు. పథకాన్ని వాడుకునే తెలివి లేదు. ఏదైనా పాడైతే ఇప్పుడు 15 రోజులైనా పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావాలంటే నాణ్యమైన విద్యుత్ 24 గంటల సరఫరా ఉండాలి. దానిపై దృష్టి లేదు. జూన్ దాకా అంటే మరో మూడు నెలల వరకు వానలు పడే అవకాశం లేదు. ఇంకా నీటి సమస్య తీవ్రం కాకుండా మిషన్ భగీరథను పునరుద్ధరించాలి. -
కేకే పార్టీ జంప్.! కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే?
సాక్షి, సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక సెలవు మరి.! ప్రస్తుత పరిస్థితుల్లో BRSలో ఉండలేనని కే. కేశవరావు చెప్పినట్టు సమాచారం. ఓ రకంగా ఇది కెసిఆర్కు మింగుడుపడని విషయం. పార్టీలో కేకేకు ఇచ్చిన ప్రాధాన్యత, పదవుల దృష్ట్యా కేకే శాశ్వతంగా ఉంటారని కెసిఆర్ భావించారు కానీ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై కెసిఆర్తో కొద్దిసేపు చర్చించిన కేకే.. తనకు ఈ పరిస్థితి అనివార్యంగా మారిందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారుతానని కేశవరావు చెప్పగానే కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు చెప్పినట్టు తెలిసింది. లోపల గరం.. గరం ఫాంహౌస్ లోపల అంతా గరంగరంగా సమావేశం జరిగినట్టు తెలిసింది. నేను పుట్టింది కాంగ్రెస్లో.. కాంగ్రెస్ లోనే చనిపోతానని తేల్చిచెప్పిన కేకే చెప్పగా.. కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడతానంటే ఎలా? ప్రజలు అన్నీ గమనిస్తారని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం. నీకు, నీ ఫ్యామిలీ కి BRS పార్టీ ఏం తక్కువ చేసిందని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. కేకే అభ్యంతరాలు ఇవి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు జాతీయ రాజకీయాల్లో అనవసరంగా తల దూర్చారు TRS పేరును BRSగా మార్చి గాల్లో మేడలు కట్టారు మహారాష్ట్రలో ప్రచారం చేయడం పెద్ద తప్పు అసలు రాజకీయ క్షేత్రం తెలంగాణను వదిలిపెట్టారు పార్టీని నమ్ముకున్న నాయకుల మాటలను పెడచెవిన పెట్టారు కొందరు అధికారులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు నిర్ణయాధికారాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుల కంటే అధికారుల మాట విన్నారు కూతురు వెంటే కేకే ఇప్పటికే కాంగ్రెస్లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారాన్ని కేకే నిజం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే చేసిన ప్రకటన సంచలనమయింది. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేకే.. ఏకంగా బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్న కేకే..ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధుల పైకి దురుసుగా దూసుకు వచ్చారు. తీసుకుంటారా వీడియా.. నన్ను తీసుకోండి అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కేసీఆర్.. కేకే.. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. ఒకప్పుడు కాంగ్రెస్లో అత్యంత సీనియర్. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవాడంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకేకు ఏకంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఇచ్చారు కేసీఆర్. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు. పోతూ పోతూ విసుర్లు పార్టీ మారే పరిస్థితి వచ్చిన తర్వాత కేకే తన అసంతృప్తిని బయటపెట్టారు. తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, ఇంజినీర్లు చేయాల్సిన పనిలో తల దూర్చారని, ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కేకే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు తెలిసింది. మా నాన్న సంగతి నాకు తెలియదు : కేకే కొడుకు విప్లవ్ "పార్టీ మారే ఆలోచనలో కె.కె, విజయలక్ష్మి ఉన్నట్టు వస్తున్న వార్తలకు, వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనే BRSలోనే ఉన్నాను, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరితే, వారు ధృవీకరిస్తే అప్పుడు మాత్రమే నేను మరింత మాట్లాడగలను." ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన
Related News by category
-
నీటి ఎద్దడి రాకుండా చూడాలి
దుగ్గొండి : వేసవి పూర్తయ్యే వరకు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అఽధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని చాపలబండ, గిర్నిబావి, అడవిరంగాపురం గ్రామాల్లో గురువారం ఆయన తాగునీటి వనరులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని బావుల్లో నీటి లభ్యత, గ్రామానికి కావాల్సిన నీటి అంచనాలను బేరీజు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని పైపులైన్ ద్వారా నీటిని బావిలోకి పోయించాలన్నారు. చేతి పంపులను వెంటనే మరమ్మతులు చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యదర్శులు నిరంతరం గ్రామాల్లో ఉంటూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి మోడెం శ్రీధర్గౌడ్, పంచాయతీ కార్యదర్శులు వైనాల రాజు, మాడిశెట్టి స్రవంతి, సునీత పాల్గొన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి నల్లబెల్లి : గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన అన్నారు. మండలంలోని నందిగామ గ్రామాన్ని గురువారం ఆమె గురువారం సందర్శించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. డీపీఓ వెంట మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్, పంచాయతీ కార్యదర్శి వద్ది రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ స్థానం బీజేపీదే.. గీసుకొండ : దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఈసారి వరంగల్ ఎంపీ స్థానం బీజేపీకే అని పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్, ఎంపీ ఎన్నికల మండల కోఆర్డినేటర్ డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మరోమారు మోదీ అధికారంలోకి వస్తే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అవసరమైన నిధులు మంజూరు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిందన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ముల్క ప్రసాద్, మండల అధ్యక్షుడు జాన్విక్రం, నాయకులు కత్తి వెంకన్న, ఆకుల వెంకన్న, మర్రి రాజు, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న చేను దగ్ధం ● మూడు గొర్రెలు సజీవ దహనం ● రూ.2 లక్షల ఆస్తినష్టం నర్సంపేట రూరల్ : అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న చేను దగ్ధమైన సంఘటన మహేశ్వరం గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన నామాల పరమేశ్వర్కు మహేశ్వరం గ్రామ శివారులోని 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట కోత దశకు వచ్చింది. ప్రమాదవశాత్తు గాలికి మంటలు చెలరేగడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. మొక్కజొన్న చేనులో మేత మేస్తున్న మూడు గొర్రెలు సైతం సజీవ దహనమయ్యాయి. మొత్తం రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు రోదిస్తూ తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు. -
ఎల్ఈడీ వెలుగులేవి?
నల్లబెల్లి : గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్లతో విద్యుత్ బిల్లులు భారీగా రావడం.. నిర్వహణ కష్టమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యుత్ పొదుపు, నిర్వహణ వ్యయం తగ్గేలా వీధిలైట్లను నిర్వహిస్తామని ముందుకొచ్చిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) గుర్తింపు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు ఎల్ఈడీ లైట్ల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ వ్యవహారాలను ఈ సంస్థ చూడాల్సి ఉంది. ప్రజాప్రతినిధుల పట్టింపు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్ల నిర్వహణను సంస్థ గాలికొదిలేసింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బిగించిన లైట్లను మరమ్మతు చేయడం లేదు. పనిచేయని లైట్ స్థానంలో మరో లైట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇవేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒప్పందాన్ని విస్మరించిన ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఏడాదిన్నర క్రితం గ్రామ పంచాయతీలకు ఎల్ఈడీ లైట్ల వెలుగులు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా.. 319 గ్రామ పంచాయతీల్లో 56 వేల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. లైట్ల బిగింపుతోపాటు నిర్వహణ, ఇంధన పొదుపు సాంకేతికతలో భాగంగా టైమర్ల ఏర్పాటు వ్యవస్థను సంస్థ ఏడేళ్లపాటు చూసుకోవాల్సి ఉంది. కానీ, నిర్వహణ బాధ్యతలను ఈఈఎస్ఎల్ విస్మరించింది. ఫలితంగా సుమారు ఐదు నెలలుగా పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ కాంతులు వెదజల్లుతాయని అనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. లైట్ల నిర్వహణ చేపట్టాలని మండలస్థాయి అధికారులు ఆ సంస్థ ప్రతినిధులను ఎన్నిమార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చెబుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు సంస్థపై తగు చర్యలు తీసుకొని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పల్లెల్లో నిర్వహణ బాధ్యతలను విస్మరించిన ఈఈఎస్ఎల్ ఐదు నెలలుగా అంధకారం.. కొరవడిన అధికారుల పర్యవేక్షణ జిల్లాలో 323 గ్రామాలు.. 319 జీపీల్లో 56 వేల లైట్లుసంస్థ పట్టించుకోవడం లేదు.. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో కొన్ని నెలలుగా ఎల్ఈడీ లైట్లు వెలగడంలేదు. మరమ్మతులు చేయాలని పలుమార్లు సంబంధిత సంస్థ ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడంలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. గ్రామాల్లో రాత్రి వేళ ఎల్ఈడీ వీధిలైట్లు వెలుగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా మరమ్మతులు చేపట్టి ఎల్ఈడీ వెలుగులు అందించాలి. – కూచన ప్రకాశ్, మండల పంచాయతీ అధికారి, నల్లబెల్లిచర్యలు తీసుకుంటాం..గ్రామాల్లో ఎల్ఈడీ వీధిలైట్లు వెలగడం లేదని మా దృష్టికి వచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిర్వహణ పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తాం. గ్రామాల్లో రాత్రి సమయాల్లో నిరంతరాయంగా ఎల్ఈడీ వీధి లైట్లు వెలిగేలా చూస్తాం. – కటకం కల్పన, జిల్లా పంచాయతీ అధికారి -
సాధారణానికి మించి..!
సాక్షి, వరంగల్ : జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుండడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు ఉక్కపోత కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో హైరానా పడుతున్నారు. వారం క్రితం కాస్త చల్లబడిన వాతావరణం గత ఆదివారం నుంచి మళ్లీ వేడెక్కుతోంది. 40.4 డిగ్రీ సెల్సియస్ నుంచి ఇప్పుడు ఏకంగా 45.1 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంది. అంటే సాధారణ ఉష్ణోగ్రతను మించి 8 డిగ్రీ సెల్సియస్ అత్యధికంగా గురువారం నమోదైంది. 2022 మేలో వరంగల్లో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో నెలరోజులు మిగిలి ఉండగానే ఆ స్థాయిలో ఏప్రిల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది వడదెబ్బ తగిలి చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో గురువారం ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాజకీయ పార్టీలకు గండం.. ఎండ వేడిమి ధాటికి జనాలు ఉదయం 8 దాటిందంటేనే బయటకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం వేళ అవసరమైతేనే తప్ప ఎవరూ రోడ్ల పైకి రావడం లేదు. జిల్లాలో ఖిలా వరంగల్, గీసుకొండ, దుగ్గొండి, పర్వతగిరి, నెక్కొండ, సంగెం మండలాల్లో 45 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండగా.. మిగలిన మండలాల్లో 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒంటిపూట బడులకు వెళ్లి వచ్చే విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ సభలకు బదులు ఫంక్షన్హాళ్లలోనే సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎండతో పాటు వడగాలుల ధాటికి ఏసీ ఫంక్షన్హాళ్లలోనే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎండలకు భయపడి వీటికి కూడా చాలా మంది రాకపోవడం గమనార్హం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోని రావాలని, నీరు, పండ్ల రసాలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. గంటలకొద్దీ ప్రయాణం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత ల వివరాలు.. నాలుగు రోజులుగా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గీసుకొండ మండలం గొర్రెకుంటలో 45.1 డిగ్రీల నమోదు భానుడి ప్రతాపంతో ప్రజల బెంబేలు.. సభలకు బదులు ఫంక్షన్హాళ్లలో రాజకీయ పార్టీల సమావేశాలు అవసరమైతేనే బయటకు రావాలని వైద్యాధికారుల సూచనరోజు ప్రాంతం డిగ్రీ సెల్సియస్లలో ఆదివారం ఉర్సుగుట్ట 40.4 సోమవారం ఖిలా వరంగల్ 42.4 మంగళవారం కల్లెడ (పర్వతగిరి) 43.4 బుధవారం రెడ్లవాడ (నెక్కొండ) 43.7 గురువారం గొర్రెకుంట (గీసుకొండ) 45.1 -
అరూరి చిన్న మెదడు చిట్లింది
హసన్పర్తి: అరూరి రమేశ్ చిన్న మెదడు చిట్లిందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ సన్నాహక సమావేశం హనుమకొండ హంటర్రోడ్డులోని డీ–కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగింది. సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొంతమంది ఇతర పార్టీ నాయకులు కావ్యను నాన్లోకల్ అంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే దేశంలో లౌకికవాదం లేకుండా పోతుందని తెలిపారు. పదేళ్ల కాలంలో బీజేపీ చేసిన అభివృద్ది ఏమీ లేదని, కేవలం దేవుళ్ల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ పదేళ్ల కాలంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేశ్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఓ భూ బకాసురుడని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎంపీ దయాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నమిండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
పాలిటిక్స్ షురూ..
శుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024ఓవైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం – 8లోuసాక్షి, వరంగల్ : ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ఫంక్షన్హాళ్లను వేదికగా చేసుకుంటున్నారు. ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. శుక్రవారం మాను కోటలో సీఎం ప్రచారసభలో పాల్గొన నున్నారు. అదేవిధంగా ఈ నెల 24న హనుమకొండలో బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డు, మహబూబాబాద్ పార్లమెంట్ ఎస్టీ రిజర్వ్డు స్థానాలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధి నేత కేసీఆర్తోపాటు మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ప్రచారం చేసేలా ఆ పార్టీ షెడ్యూల్ రూపొందించుకుంటోంది. అదే సమయంలో బీజేపీ కూడా జాతీయ అగ్రనేతలతో ప్రచారం ఉండేలా కసరత్తు చేస్తోంది. దీంతో ఆయా పార్టీల ముఖ్యనేత ల ప్రసంగాలకు ఉమ్మడి వరంగల్ వేదిక కానుంది. రెండు రోజుల్లో నామినేషన్లు.. తొలిరోజు నామినేషన్ల దాఖలుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆసక్తిచూపలేదు. రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున కడియం కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరు నామినేషన్లు దాఖలు చేసేందుకు మంచి ముహూర్తం కోసం ఆరా తీస్తున్నారు. 20వ తేదీలోపే మంచి రోజులు ఉండడంతో కొందరు శుక్రవారం, మరికొందరు శనివారంలోపు నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఆయా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఆయా పార్టీల నాయకులు గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను కూడా నియమించాయి. ఈ నెల 24న మడికొండలో సీఎం రేవంత్రెడ్డి ప్రచార సభకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబు తున్నారు. ఈ మేరకు గురువారం పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. వీరి జాతకం తేల్చేది ఎంతమందంటే.. వరంగల్ లోక్సభ పరిధిలో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 18,16,543 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,91,940 మంది పురుష ఓటర్లు, 9,24,208 మంది మహిళా ఓటర్లున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగుతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 15,30,367 మంది ఓటర్లున్నారు. వీరిలో 7,46,982 మంది పురుష ఓటర్లు, 7,83,280 మంది మహిళా ఓటర్లున్నారు. వీరంతా నాయకుల జాతకం తేల్చనున్నారు. న్యూస్రీల్ ఉమ్మడి జిల్లాలో మొదలైన రాజకీయ వేడి వరంగల్, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో గెలుపుపై దృష్టి 24న హనుమకొండలో కాంగ్రెస్ సభ నిర్వహణకు కసరత్తు అదేబాటలో బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతల ప్రచారానికి ప్లాన్ నామినేషన్ల దాఖలుకు మంచి ముహూర్తంపై అభ్యర్థుల ఆరానామినేషన్ సెంటర్వద్ద భారీ బందోబస్తు వరంగల్ పార్లమెంట్ స్థానానికి వరంగల్ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం నామినేషన్ సెంటర్లోని ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. నేడు మానుకోటకు సీఎం ఎన్నికల ప్రచార సభకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మనుకోటకు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వస్తున్నారు. కాగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ ఉదయం నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4గంటలకు మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం హాజరై ప్రసంగిస్తారు. 6గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్తారు. కాగా, మూడు రోజులుగా సభ ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గురువారం మంత్రి తుమ్మల జిల్లా పోలీస్ అధి కారులతో కలిసి సభా వేదిక, హెలిపాడ్ను పరి శీలించారు. దంచికొండుతున్న ఎండల నేపథ్యంలో బహిరంగ సభకు జనసమీకరణ స్థానిక నాయకులకు సవాల్గా మారింది. గతంలో మాదిరిగా ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వచ్చే పరిస్థితి లేదని, వారికి అన్ని ఏర్పాట్లు చేస్తేనే వస్తారని పలువురు నాయకులు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ శుక్రవారం ఉదయమే నామినేషన్ వేయనున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కూటముల కురుక్షేత్రం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement