రేపు విజయవాడకు కేసీఆర్ | Sakshi
Sakshi News home page

రేపు విజయవాడకు కేసీఆర్

Published Sun, Dec 13 2015 5:24 PM

రేపు విజయవాడకు కేసీఆర్ - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం విజయవాడలో కలవనున్నారు. ఉదయం 11:30 గంటలకు బేగంపేట నుంచి విజయవాడ బయలుదేరుతారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ కానున్నారు. అయుత చండీ యాగానికి చంద్రబాబును, మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.

ఈ నెల 16న శృంగేరి మఠానికి కేసీఆర్ వెళ్లనున్నారు. శృంగేరి మఠాధిపతిని చండీ యాగానికి ఆహ్వనించనున్నారు.

Advertisement
Advertisement