ముస్తాక్ కుటుంబానికి చెక్కు అందజేసిన కేఈ | Sakshi
Sakshi News home page

ముస్తాక్ కుటుంబానికి చెక్కు అందజేసిన కేఈ

Published Tue, Feb 16 2016 10:53 AM

KE Krishnamurthy pay tributes to mushtaq ahmed

కర్నూలు :  సియాచిన్లో మరణించిన ఆర్మీ జవాన్ ముస్తాక్ భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని పార్నపల్లెలో ముస్తాక్ భౌతికకాయాన్ని కేఈ సందర్శించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ముస్తాక్ కుటుంబసభ్యులకు రూ. 25 లక్షల చెక్కును కేఈ కృష్ణమూర్తి అందజేశారు.

Advertisement
Advertisement