కిడ్నాప్‌ కలకలం! | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కలకలం!

Published Thu, Sep 29 2016 11:07 PM

కిడ్నాప్‌ కలకలం!

రాజాం (సంతకవిటి) : రాజాంలో బుధవారం కిడ్నాప్‌ కలకలం రేగింది. దీనికి సంబంధించి ఆలస్యంగా వెలుగు చూసిన వివరాలు...రాజాం మారుతీనగర్‌ మూడో లైన్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థి స్థానిక ఓ ప్రైవేటు కళాశాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారిపై ఆటో కోసం నిరీక్షిస్తున్నాడు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు తెలుగు రంగు వ్యాన్‌లో వచ్చి కిడ్నాప్‌ చేసినట్టు తెలిసింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో కళాశాల నుంచి తమ కుమారుడు రాకపోయే సరికి కుటుంబీకులు ఆరా తీస్తుండగా కిడ్నాప్‌కు గురైన యువకుడే విశాఖపట్నం నుంచి ఫోన్‌ చేసి తాను కిడ్నాప్‌కు గురైనట్టు చెప్పాడు.
 
గుర్తు తెలియని వ్యక్తులు తనను తీసుకువచ్చి భీమిలి వద్ద రోడ్డు పక్కన పొదల్లో వదిలేసినట్టు కుటుంబ సభ్యులకు తెలిపినట్టు సమాచారం. దీంతో స్పందించిన వారు సమాచారాన్ని విశాఖలో ఉన్న బంధువులకు తెలియజేసి కుమారుడిని తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే ఈ విషయమై సంతకవిటి, రాజాం పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఇది ఉత్తి పుకార్లేనని మారుతీనగర్‌ వాసులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కిడ్నాప్‌కు గురైన యువకుని కుటుంబీకులు ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు నిరాకరించారు.  

Advertisement
Advertisement