హత్య చేసి.. కాల్చివేసి... | Sakshi
Sakshi News home page

హత్య చేసి.. కాల్చివేసి...

Published Thu, Dec 22 2016 10:37 PM

.. Killed and shoots ...

  •  పావగడలో యువకుడి దారుణ హత్య
  • హతుడు దేవరకొండ వాసిగా గుర్తింపు
  • వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు
  • పావగడలోని మున్సిపల్‌ బస్టాండు సమీపంలో దేవరకొండకు చెందిన రంగనాథ్‌(35) దారుణ హత్యకు గురయ్యాడని ఎస్‌ఐ మంజునాథ్‌ తెలిపారు. గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి మంజునాథ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బస్టాండు సమీపంలోని ఎస్‌బీఐ సమీపంలో చరండీలో పడేశారన్నారు. అంతటితో ఆగక హతుడ్ని గుర్తు పట్టకుండా ఒంటిపై పెట్రోలు పోసి తగులబెట్టారన్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement