తెలుగు ప్రజల వందేళ్ల కల పోలవరం ప్రాజెక్టు | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజల వందేళ్ల కల పోలవరం ప్రాజెక్టు

Published Tue, Dec 27 2016 7:17 PM

kurasala kannababu takes on chandra babu

కాకినాడ: పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజల వందేళ్ల కల అని తూర్పుగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కల ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు.

ప్రజల కలను సాకారం చేసేందుకు దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ ఎంతో కష్టపడ్డారని చెప్పారు. 10 వేల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పోలవరం ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పారు. నాడు వైఎస్‌ఆర్‌ చేసిన పనిని ధనయజ్ఞమని విమర్శించిన చంద్రబాబు.. నేడు అదే ప్రాజెక్టు అంచనాను 40 వేల కోట్ల రూపాయలకు పెంచారని విమర్శించారు. 2018 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో తెలపాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ముంపు బాధితులకు ఇచ్చే ఆర్‌ఆర్‌ ప్యాకేజీపై కేంద్ర దృష్టిసారించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్నదే తమ ఆకాంక్ష అని, రాష్ట్ర ప్రభుత్వం ప్రచార, ఆర్భాటాల కోసమే వైఎస్‌ఆర్ సీపీపై ఆరోపణలు చేస్తోందని కన్నబాబు విమర్శించారు.

Advertisement
Advertisement