బైక్‌ను ఢీకొన్న క్వాలీస్‌ | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న క్వాలీస్‌

Published Sun, Jul 24 2016 11:23 PM

బైక్‌ను ఢీకొన్న క్వాలీస్‌ - Sakshi

ఒకరికి తీవ్రగాయాలు
గండేడ్‌: బైక్‌ను క్వాలీస్‌ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గండేడ్‌ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండల కేంద్రానికి చెందిన కావలి మోహన్‌ నిత్యం బైకుపై వివిధ ప్రాంతాలు తిరుగతూ కోడిపిల్లలు విక్రయిస్తుంటాడు. ఈక్రమంలో అతడు ఆదివారం కోడిపిల్లలను అమ్ముకునేందుకు మండల పరిధిలోని కోస్గి గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో గండేడ్‌ గ్రామ సమీపంలో మహబూబ్‌నగర్‌ నుంచి కోస్గి వైపు ఎదురుగా వస్తున్న క్వాలీస్‌‌ డ్రైవర్‌ సయ్యద్‌ అక్రం వేగంగా బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్‌ అదుపుతప్పి కిందపడింది. వేగంగా వెళ్తున్న క్వాలీస్‌ వాహనం కూడా బోల్తాపడింది. క్వాలీస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. బైకుపై ఉన్న మొహన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో మహబూబ్‌నగర్‌ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. మోహన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మహమ్మదాబాద్‌ ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement