♦ సంగారెడ్డిలో శ్రీవిరాట్ వేంకటేశ్వరస్వామి లడ్డూకు రికార్డు ధర
♦ వేలం పాటలో సొంతం చేసుకున్న దామోదర సతీమణి
సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి శివారులోని శ్రీమహాలక్ష్మి గోదా సమేత శ్రీవిరాట్వెంకటేశ్వర స్వామి లడ్డూ వేలం పాటలో రికార్డు ధర పలికింది. మునుపెన్నడూ లేని విధంగా రూ.77,77,777.77 వెచ్చించి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని స్వామివారి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంతో లడ్డూను దక్కించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో బాలాపూర్, కూకట్పల్లి ప్రగతినగర్ గణేశ్ లడ్డూ (బాలాపూర్-రూ.9.53 లక్షలు, ప్రగతి నగర్-రూ.15 లక్షలు) వేలం పాటల రికార్డు బ్రేక్ చేసినట్లయింది. ధనుర్మాసం సందర్భంగా శ్రీవైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో యేటా గోదా శ్రీని వాస కల్యాణం జరుగుతుంది.
ఈ సందర్భంగా స్వామి వారి లడ్డూకు వేలంపాట నిర్వహించడం ఆనవాయితీ. గతేడాది నిర్వహించిన వేలం పాటలో టీఆర్ఎస్ నేత, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ రూ.7.77 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. బుధవారం స్వామివారి కల్యాణం అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ , ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు లడ్డూ వేలం నిర్వహిం చారు. వేలం పాటలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 25 కిలోల లడ్డూకు ప్రారంభ వేలం పాటను రూ.7,777గా నిర్ణయించారు.
అక్కడ్నుంచి వేలం మొదలవగా.. ఆలయ మహిళా కార్యకర్తలు రూ.3.80 లక్షల వర కు పాడారు. ఆ తర్వాత సంగారెడ్డికి చెందిన వైద్యుడు డా.కుమార్ రాజా రూ.55 లక్షలు పాడగా, పురం పాండ య్య కుటుంబీకులు రూ.65 లక్షలకు పాడారు. తర్వాత కుమార్ రాజా రూ.66 లక్షలకు పెంచగా.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని ఏకంగా రూ.77,77,777.77 వేలం పాట పాడి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్, ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ... లడ్డూను కైవ సం చేసుకున్నవారికి అన్నీ శుభాలే కలుగుతాయన్నారు.
మంచి జరుగుతుందనే విశ్వాసంతోనే: పద్మిని దామోదర
ఈ లడ్డూను దక్కించుకొనే వారికి అంతా మంచి జరుగుతుందన్న విశ్వాసం ఉంది. అందుకే లడ్డూను కైవసం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ధర ఎక్కువైందని కాకుం డా.. లడ్డూను దక్కించుకున్నాననే సంతోషం ఉంది.
లడ్డూ రూ.77,77,777.77
Published Thu, Jan 14 2016 3:12 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మెట్ గాలా-2024 ఈవెంట్లో మెరిసిన సెన్సేషనల్ బ్యూటీ మోనా పటేల్.. ఫోటోలు
BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట
కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్
డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం
ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ కీ కామెంట్స్
మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?
శ్రీసిటీ.. ఇది సిరుల సిటీ: రవి సన్నా రెడ్డి
సీఎం జగన్ కాన్వాయ్ విజువల్స్
ఎన్నికలకు ముందే ఏ స్థాయిలో కుట్రలంటే.. : సీఎం జగన్
తప్పక చదవండి
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement