గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సు నీటిమట్టం 29 అడుగులు దాటింది. ఆదివారం మధ్యాహ్నం సరస్సులో 29 అడుగుల 3 అంగుళాల నీరుంది. ఈ మేరకు సరస్సు ప్రధాన కాల్వల్లోని నర్సింహుల, రంగాపురం కాల్వల కోసం నీటిని సద్దిమడుగులోకి వదిలారు. తర్వాత అక్కడి నుంచి కాల్వలకు నీటిని వదిలారు. ఇదిలా ఉండగా, సరస్సు తూముల వద్ద 24 అడుగుల ఎత్తులో రాళ్ల మధ్య నుంచి నీరు ఎక్కువగా లీకవుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, నీటిని విడుదల చేయాల్సిన సమయంలో కూడా నీటిపారుదల శాఖ అధికారులు రాకుండా స్థానిక గ్యాంగ్మెన్లతోనే పనులు చేయించడం గమనార్హం. పదివేల ఎకరాలకు సాగునీరందిస్తూ, పర్యాటక ప్రాంతంగా ప్రభు త్వానికి ఆదాయం సమకూరుస్తున్న సరస్సుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
29 అడుగులు దాటిన లక్నవరం నీటిమట్టం
Published Mon, Jul 25 2016 12:28 AM
# Tag
Related news
-
నిత్యావసరాల ధరల మంట
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెలలోనూ ఎగువబాటనే కొనసాగింది. ఏడు నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర స్థాయిలో 0.73 శాతంగా (2022 డిసెంబర్తో పోల్చి) నమోదయ్యింది. 2023 మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 1.41 శాతం ఎగసింది. అటు తర్వాత ఈ స్థాయిలో పెరుగుదల ఇదే తొలిసారి. ఆహార, కూరగాయల ధరలు సహా పలు విభాగాల్లో ధరల తీవ్రత తాజా టోకు ద్రవ్యోల్బణం తీవ్రతకు ప్రధాన కారణం. 2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ద్రవ్యోల్బణం మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో కొనసాగింది. నవంబర్లో ‘యూటర్న్’ తీసుకుని 0.26 శాతంగా నమోదయ్యింది. తాజా సమీక్షా నెల డిసెంబర్లో మరింత పెరిగి 0.73 శాతానికి ఎగసింది. ఒక్క ఆహార ద్రవ్యోల్బణాన్ని చూస్తే, నవంబర్లో ఈ రేటు 8.18 శాతం ఉంటే, డిసెంబర్లో 9.38 శాతానికి ఎగసింది. కూరగాయల విషయంలో ద్రవ్యోల్బణం భారీగా 26.30 శాతం పెరగ్గా, పప్పు ధాన్యాల ధరలు 19.60 శాతం పెరిగాయి. 2023 ఆగస్టు నుంచి ఈ నిత్యావసర వస్తువల ధర రెండంకెలపైన కొనసాగుతోంది. -
సామాన్యులపై మరో పిడుగు: ముడిచమురుపై భారీగా టాక్స్ పెంపు
Windfall Tax on Crude oil భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులకు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్ఫాల్ టాక్స్ను భారీగా పెంచింది. టన్నుకు రూ.6,700 నుంచి రూ.10,000కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. సవరించిన ధరలు నేటి (సెప్టెంబర్ 16)నుంచే అమల్లో ఉంటాయి. తాజా నిర్ణయంతో ఇప్పటికే పెట్రో భారంతో అతలాకుతమవుతున్న సామాన్యులపై మరింత భారం పెరగనుంది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF)పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) లీటర్కు 4 రూపాయల నుండి 3.50 రూపాయలకు ప్రభుత్వం తగ్గించింది. అలాగే డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ను లీటరుకు రూ.6 నుంచి రూ.5.5కు తగ్గిస్తున్నట్లుకేంద్రం ప్రకటించింది. పెట్రోల్ ఎగుమతిపై SAED సున్నాగా కొనసాగుతుంది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి పన్ను రేట్లు సమీక్ష ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న జరిగిన పక్షంవారీ సమీక్షలో ప్రభుత్వం ముడి పెట్రోలియంపై టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించింది. భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులపై విండ్ఫాల్ పన్నును గత ఏడాది జూలైలో మొదటిసారిగా విధించారు. అలాగే సెప్టెంబర్ 1న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ ట్యాక్స్ను టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించిన సంగతి తెలిసిందే.మరోవైపు చమురు ధరలు 10 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. -
కేరళలో మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్.. ఆరుకి చేరిన నిఫా కేసులు
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరోకేసు వెలుగులోకి వచ్చింది. 39 ఏళ్ల మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో నిఫా వైరస్ బారిన పడినవారి సంఖ్య ఆరుకు చేరింది. వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా.. వైరస్ వ్యాప్తితో శుక్రవారం ప్రార్థనలు బంద్ చేశారు. వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండటంతో కాంటాక్ట్ లిస్ట్ కూడా క్రమంగా హెచ్చవుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 950 మంది కాంటాక్ట్ లిస్ట్లో ఉండగా.. 213 మంది అధిక ముప్పు ఉన్న జాబితాలో ఉన్నారు. కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారిలో 287 మంది హెల్త్ వర్కర్లే కావడం గమనార్హం. అధిక ముప్పులో ఉన్న 15 మంది షాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. కంటెయిన్మెంట్ జోన్లో ఏడు గ్రామాలు.. నిఫా వైరస్తో రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు బంద్.. నిఫా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. కంటెయిన్మెంట్ జోన్లో ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామశాఖ ఆఫీస్లు తక్కువ స్టాఫ్తో నడపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసివేయాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చెప్పారు. అప్రమత్తమైన కేంద్రం.. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలను కేరళకు పంపించింది. కోజికోడ్ మెడికల్ కాలేజీలో సంచార ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పందులు, గద్దల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేయనున్నారు. బంగ్లాదేశ్ వేరియంట్.. ఇప్పటివరకు రాష్ట్రంలో నిఫా వైరస్ పట్ల భయపడాల్సిన పనిలేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్గా పేర్కొన్న ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో అలర్ట్.. కేరళలో నిఫా వైరస్ పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. సరిహద్దు జిల్లాల్లో ఫీవర్ సర్వెలెన్స్ వంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అనుమానిత కేసులకు ఆస్పత్రుల్లో పడకలు సిద్ధం చేయడం సహా వైద్యులకు శిక్షణ తరహా చర్యలు చేపడుతోంది. ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్లా ఆడగలను: సింథియా -
90 డాలర్ల ఎగువకు చేరిన బ్యారెల్ చమురు ధర
90 డాలర్ల ఎగువకు చేరిన బ్యారెల్ చమురు ధర -
వంట నూనెల ధరలు తగ్గాయి.. దిగుమతులు భారీగా పెరిగాయి!
న్యూఢిల్లీ: వెజిటబుల్ నూనెల దిగుమతులు జూలై నెలలో భారీగా పెరిగిపోయాయి. 17.71 లక్షల టన్నుల మేర దిగుమతులు నమోదైనట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. 2022 జూలై నెలలో నమోదైన 12.14 లక్షల టన్నుల దిగుమతులతో పోలిస్తే 46 శాతం పెరిగినట్టు తెలిపింది. 2022–23లో తొలి తొమ్మిది నెలల సీజన్లో (నవంబర్–అక్టోబర్) దిగుమతులు 23 శాతం పెరిగి 122.54 లక్షల టన్నులుగా ఉన్నట్టు పేర్కొంది. వెజిటబుల్ నూనెల్లో వంటకు వినియోగించేవే కాకుండా, వంటకు వినియోగించనివి (ఆహార పదార్థాల్లో వినియోగానికి) కూడా ఉంటాయి. ఇక ఈ ఏడాది జూలైలో వంట నూనెల దిగుమతుల వరకే చూస్తే 46 శాతం పెరిగి 17.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 12.05 లక్షల టన్నుల మేర దిగుమతి అయ్యాయి. ఇతర నూనెల దిగుమతులు 9,069 టన్నుల నుంచి 15,999 టన్నులకు పెరిగాయి. దేశీయంగా వంట నూనెల ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్ తిరిగి పెరిగినట్టు ఎస్ఈఏ తెలిపింది. దేశంలో 45 రోజుల వినియోగానికి సరిపడా వంట నూనెల నిల్వలు ఉన్నాయని, పండుగల రోజుల్లో నూనెల సరఫరా మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. పామాయిల్ను ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుండగా, అర్జెంటీనా నుంచి సోయాబీన్ ఆయిల్ దిగుమతి అవుతోంది. సన్ఫ్లవర్ నూనె ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తోంది.
Related News by category
-
No Headline
వరంగల్ అర్బన్: ‘కారు కడిగితే రూ.5 వేలు జరిమానా. స్విమ్మింగ్ పూల్స్ వాడితే కఠిన చర్యలు. మోటార్లు పెట్టి నీటిని లాగితే జైలు శిక్ష’ ఇది కర్ణాటకలో పరిస్థితి. అక్కడ తాగునీటి క్యాన్ (20 లీటర్లు) రూ.200 ధర పలుకుతోందట! అలాంటి పరిస్థితి మనకు రావొద్దంటే నీటిని సరిగ్గా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. గ్రేటర్ వరంగల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. మూడేళ్ల తర్వాత మళ్లీ రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. అదీ గంట కూడా పైపులైన్ల చివరి నల్లాల వరకు అందడం లేదు. జూన్లో వర్షాలు కురవకపోతే దేవాదుల నుంచి నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నగరానికి నీటి కష్టాలు తప్పకపోవచ్చు. ప్రత్యామ్నాయ జలాశయాలు లేక నీటి ఎద్దడి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయమేది? వరంగల్ మహానగర ప్రజలకు ధర్మసాగర్ చెరువు మాత్రమే శరణ్యమైంది. ధర్మసాగర్ జలాశయం సామర్థ్యం 1,500 ఎంసీఎఫ్టీ. ప్రస్తుతం ధర్మసాగర్లో ఉన్న నీరు మరో 80 రోజుల వరకు సరిపోతు ందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు, డెడ్ స్టోరేజీ, నీటి వాడకం తదితర కారణాలతో 60 రో జులే నీరందవచ్చని నిపుణుల అంచనా. లీకేజీలు.. అక్రమ నల్లాలు ప్రస్తుతం మహా నగరానికి రోజూ 6 ఎంసీఎఫ్టీల నీరు అవసరం కాగా.. 5 ఎంసీఎఫ్టీల రా వాటర్ సరఫరా అవుతోంది. ఫిల్టర్బెడ్ల ద్వారా శుద్ధి చేసిన నీరు 35 శాతం నీటికి లెక్కలు దొరకడం లేదు. లీకేజీలు, అక్రమ కనెక్షన్లతో నీరు పక్కదారి పడుతోంది. కొన్ని చోట్ల మోటార్లతో నీటిని లాగుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఇంజనీర్లు వైఫల్యం చెందుతున్నారనే విమర్శలున్నాయి. దేశాయిపేట ఫిల్టర్బెడ్ -
నీటి ఎద్దడి రాకుండా చూడాలి
దుగ్గొండి : వేసవి పూర్తయ్యే వరకు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అఽధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని చాపలబండ, గిర్నిబావి, అడవిరంగాపురం గ్రామాల్లో గురువారం ఆయన తాగునీటి వనరులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని బావుల్లో నీటి లభ్యత, గ్రామానికి కావాల్సిన నీటి అంచనాలను బేరీజు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని పైపులైన్ ద్వారా నీటిని బావిలోకి పోయించాలన్నారు. చేతి పంపులను వెంటనే మరమ్మతులు చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యదర్శులు నిరంతరం గ్రామాల్లో ఉంటూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి మోడెం శ్రీధర్గౌడ్, పంచాయతీ కార్యదర్శులు వైనాల రాజు, మాడిశెట్టి స్రవంతి, సునీత పాల్గొన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి నల్లబెల్లి : గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన అన్నారు. మండలంలోని నందిగామ గ్రామాన్ని గురువారం ఆమె గురువారం సందర్శించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. డీపీఓ వెంట మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్, పంచాయతీ కార్యదర్శి వద్ది రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ స్థానం బీజేపీదే.. గీసుకొండ : దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఈసారి వరంగల్ ఎంపీ స్థానం బీజేపీకే అని పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్, ఎంపీ ఎన్నికల మండల కోఆర్డినేటర్ డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మరోమారు మోదీ అధికారంలోకి వస్తే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అవసరమైన నిధులు మంజూరు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిందన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ముల్క ప్రసాద్, మండల అధ్యక్షుడు జాన్విక్రం, నాయకులు కత్తి వెంకన్న, ఆకుల వెంకన్న, మర్రి రాజు, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న చేను దగ్ధం ● మూడు గొర్రెలు సజీవ దహనం ● రూ.2 లక్షల ఆస్తినష్టం నర్సంపేట రూరల్ : అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న చేను దగ్ధమైన సంఘటన మహేశ్వరం గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన నామాల పరమేశ్వర్కు మహేశ్వరం గ్రామ శివారులోని 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట కోత దశకు వచ్చింది. ప్రమాదవశాత్తు గాలికి మంటలు చెలరేగడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. మొక్కజొన్న చేనులో మేత మేస్తున్న మూడు గొర్రెలు సైతం సజీవ దహనమయ్యాయి. మొత్తం రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు రోదిస్తూ తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు. -
ఎల్ఈడీ వెలుగులేవి?
నల్లబెల్లి : గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్లతో విద్యుత్ బిల్లులు భారీగా రావడం.. నిర్వహణ కష్టమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యుత్ పొదుపు, నిర్వహణ వ్యయం తగ్గేలా వీధిలైట్లను నిర్వహిస్తామని ముందుకొచ్చిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) గుర్తింపు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు ఎల్ఈడీ లైట్ల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ వ్యవహారాలను ఈ సంస్థ చూడాల్సి ఉంది. ప్రజాప్రతినిధుల పట్టింపు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్ల నిర్వహణను సంస్థ గాలికొదిలేసింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బిగించిన లైట్లను మరమ్మతు చేయడం లేదు. పనిచేయని లైట్ స్థానంలో మరో లైట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇవేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒప్పందాన్ని విస్మరించిన ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఏడాదిన్నర క్రితం గ్రామ పంచాయతీలకు ఎల్ఈడీ లైట్ల వెలుగులు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా.. 319 గ్రామ పంచాయతీల్లో 56 వేల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. లైట్ల బిగింపుతోపాటు నిర్వహణ, ఇంధన పొదుపు సాంకేతికతలో భాగంగా టైమర్ల ఏర్పాటు వ్యవస్థను సంస్థ ఏడేళ్లపాటు చూసుకోవాల్సి ఉంది. కానీ, నిర్వహణ బాధ్యతలను ఈఈఎస్ఎల్ విస్మరించింది. ఫలితంగా సుమారు ఐదు నెలలుగా పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ కాంతులు వెదజల్లుతాయని అనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. లైట్ల నిర్వహణ చేపట్టాలని మండలస్థాయి అధికారులు ఆ సంస్థ ప్రతినిధులను ఎన్నిమార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చెబుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు సంస్థపై తగు చర్యలు తీసుకొని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పల్లెల్లో నిర్వహణ బాధ్యతలను విస్మరించిన ఈఈఎస్ఎల్ ఐదు నెలలుగా అంధకారం.. కొరవడిన అధికారుల పర్యవేక్షణ జిల్లాలో 323 గ్రామాలు.. 319 జీపీల్లో 56 వేల లైట్లుసంస్థ పట్టించుకోవడం లేదు.. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో కొన్ని నెలలుగా ఎల్ఈడీ లైట్లు వెలగడంలేదు. మరమ్మతులు చేయాలని పలుమార్లు సంబంధిత సంస్థ ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడంలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. గ్రామాల్లో రాత్రి వేళ ఎల్ఈడీ వీధిలైట్లు వెలుగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా మరమ్మతులు చేపట్టి ఎల్ఈడీ వెలుగులు అందించాలి. – కూచన ప్రకాశ్, మండల పంచాయతీ అధికారి, నల్లబెల్లిచర్యలు తీసుకుంటాం..గ్రామాల్లో ఎల్ఈడీ వీధిలైట్లు వెలగడం లేదని మా దృష్టికి వచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిర్వహణ పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తాం. గ్రామాల్లో రాత్రి సమయాల్లో నిరంతరాయంగా ఎల్ఈడీ వీధి లైట్లు వెలిగేలా చూస్తాం. – కటకం కల్పన, జిల్లా పంచాయతీ అధికారి -
సాధారణానికి మించి..!
సాక్షి, వరంగల్ : జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుండడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు ఉక్కపోత కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో హైరానా పడుతున్నారు. వారం క్రితం కాస్త చల్లబడిన వాతావరణం గత ఆదివారం నుంచి మళ్లీ వేడెక్కుతోంది. 40.4 డిగ్రీ సెల్సియస్ నుంచి ఇప్పుడు ఏకంగా 45.1 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంది. అంటే సాధారణ ఉష్ణోగ్రతను మించి 8 డిగ్రీ సెల్సియస్ అత్యధికంగా గురువారం నమోదైంది. 2022 మేలో వరంగల్లో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో నెలరోజులు మిగిలి ఉండగానే ఆ స్థాయిలో ఏప్రిల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది వడదెబ్బ తగిలి చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో గురువారం ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాజకీయ పార్టీలకు గండం.. ఎండ వేడిమి ధాటికి జనాలు ఉదయం 8 దాటిందంటేనే బయటకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం వేళ అవసరమైతేనే తప్ప ఎవరూ రోడ్ల పైకి రావడం లేదు. జిల్లాలో ఖిలా వరంగల్, గీసుకొండ, దుగ్గొండి, పర్వతగిరి, నెక్కొండ, సంగెం మండలాల్లో 45 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండగా.. మిగలిన మండలాల్లో 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒంటిపూట బడులకు వెళ్లి వచ్చే విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ సభలకు బదులు ఫంక్షన్హాళ్లలోనే సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎండతో పాటు వడగాలుల ధాటికి ఏసీ ఫంక్షన్హాళ్లలోనే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎండలకు భయపడి వీటికి కూడా చాలా మంది రాకపోవడం గమనార్హం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోని రావాలని, నీరు, పండ్ల రసాలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. గంటలకొద్దీ ప్రయాణం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత ల వివరాలు.. నాలుగు రోజులుగా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గీసుకొండ మండలం గొర్రెకుంటలో 45.1 డిగ్రీల నమోదు భానుడి ప్రతాపంతో ప్రజల బెంబేలు.. సభలకు బదులు ఫంక్షన్హాళ్లలో రాజకీయ పార్టీల సమావేశాలు అవసరమైతేనే బయటకు రావాలని వైద్యాధికారుల సూచనరోజు ప్రాంతం డిగ్రీ సెల్సియస్లలో ఆదివారం ఉర్సుగుట్ట 40.4 సోమవారం ఖిలా వరంగల్ 42.4 మంగళవారం కల్లెడ (పర్వతగిరి) 43.4 బుధవారం రెడ్లవాడ (నెక్కొండ) 43.7 గురువారం గొర్రెకుంట (గీసుకొండ) 45.1 -
అరూరి చిన్న మెదడు చిట్లింది
హసన్పర్తి: అరూరి రమేశ్ చిన్న మెదడు చిట్లిందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ సన్నాహక సమావేశం హనుమకొండ హంటర్రోడ్డులోని డీ–కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగింది. సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొంతమంది ఇతర పార్టీ నాయకులు కావ్యను నాన్లోకల్ అంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే దేశంలో లౌకికవాదం లేకుండా పోతుందని తెలిపారు. పదేళ్ల కాలంలో బీజేపీ చేసిన అభివృద్ది ఏమీ లేదని, కేవలం దేవుళ్ల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ పదేళ్ల కాలంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేశ్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఓ భూ బకాసురుడని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎంపీ దయాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నమిండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
Advertisement