ఒంగోలు టౌన్: పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ లేకుండా 1బి ఆధారంగానే ఈ-పాస్ పుస్తకం ఇవ్వడం వల్ల భూముల రికార్డులు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల భూములను రీ సర్వేచేసి తప్పులు సరిచేసి ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మల్లయ్య లింగం భవనంలో జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-పాస్ పుస్తకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. 1బీ ఆధారంగా ఈ-పాస్ పుస్తకం ఇస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
రైతు సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి 31 వరకు కడపలో రాష్ట్ర స్థాయి వర్క్షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వర్క్షాపుకు జిల్లా నుంచి 30 మంది రైతులు హాజరు కావాలన్నారు. కౌలు రైతుల సంఘం జిల్లా మహాసభలు ఆగస్టు చివరి వారంలో మేదరమెట్లలో నిర్వహించాలని కోరారు. సభ్యత్వాలు పూర్తిచేసి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలను పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎరువుల ధరలను వెంటనే అమలుచేసి రాష్ట్రంలోని రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డీ శ్రీనివాస్, వీ హనుమారెడ్డి, నాయకులు వై సింగయ్య, కే వీరారెడ్డి, బి.ప్రసాద్, పి.వి.కొండయ్య, జి.వెంకటేశ్వర్లు, కె.ఎల్.డి.ప్రసాద్, బి.సుబ్బారెడ్డి, బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రకాశంను కరువు జిల్లాగా ప్రకటించాలని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు.
ఈ-పాస్తో భూముల రికార్డులు తారుమారు
Published Thu, Jul 21 2016 11:28 AM
# Tag
Related news
-
భూ హక్కులకు భద్రత
సాక్షి, అమరావతి: భద్రమైన భూముల వ్యవస్థ, సమర్థమైన భూ పరిపాలన కోసం ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సంస్కరణలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయి. భూముల సమస్యలను పరిష్కరించడంలో, భూ పరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ ఐదేళ్లలో అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. భూ రికార్డుల్లో అస్పష్టత, సర్వే రికార్డుల్లో సమస్యలు, వివాదాలు, వ్యాజ్యాలవల్ల స్తంభించిన భూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని చర్యలను ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కారు సాహసోపేతంగా తీసుకుంది. భూములతో ముడిపడి ఉన్న చిక్కుముడుల్ని విప్పడంతో భూ యాజమాన్యం ఇప్పుడు సమర్థవంతంగా మారింది. భూ సమస్యలతో దశాబ్దాలుగా చితికిపోయిన వారు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ♦ నూతన పింఛను పథకం కింద ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి జీపీఎస్ (ఏపీ హామీ పింఛను పథకం) అమలుచేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉద్యోగులకు లాభదాయకమైన, స్థిరమైన, ప్రత్యామ్నాయ పింఛను పథకంగా ఇది ఉంది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు మా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించింది. ♦ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగిస్తూ ఏమన్నారంటే.. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఉన్న భూములను పునఃపరిశీలన (రీసర్వే) చేయడం కోసం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని 2020, డిసెంబర్ 21న ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం, నిరంతరాయంగా పనిచేసే సరికొత్త జియో రిఫరెన్స్ స్టేషన్ల (సీఓఆర్ఎస్) టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా రీ సర్వే అత్యంత శాస్త్రీయంగా జరుగుతోంది. ♦ ఇప్పటివరకు 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు ఇచ్చాం. 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. రీ సర్వేలో 45వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. ♦ 1.37 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా 22(ఎ) నుంచి తొలగించడం ద్వారా 1.13 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 33,428.64 ఎకరాల షరతులు గల పట్టా భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం ద్వారా 1.07 లక్షల మంది రైతులకు ఆ భూములపై సర్వహక్కులు ఏర్పడ్డాయి. 1982 నుంచి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద భూములు పొందిన 22,837 ఎకరాలకు చెందిన 22,346 మంది భూమిలేని దళితుల భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించడం ద్వారా లబ్ధిపొందారు. భూమిలేని నిరుపేదలకు 46,463 ఎకరాల డీకేటీ పట్టాలను పంపిణీ చేశాం. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట.. ♦మా ప్రభుత్వం ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. 2014–19 మధ్యకాలంలో ఇచ్చిన 34,108 ఉద్యోగాల కంటే ఇవి ఎన్నో రెట్లు ఎక్కువ. సుమారు 10 వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. 51,387 మంది ఆర్డీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కాస్ సంస్థను ఏర్పాటుచేశాం. ♦ 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమానికి మంజూరు చేశాం. 11వ వేతన సవరణ సంఘం సిఫారసులను అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాం. ♦ ఆశ్కా వర్కర్లు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపాల్టీల్లో పనిచేసే ఔట్సోర్సింగ్, ప్రజారోగ్య కార్మికులకు, సెర్ప్కి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, మెప్మాకు చెందిన రీసోర్స్ పర్సన్లు, హోమ్గార్డులు, మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న సహాయకులు, అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు ప్రభుత్వం వేతనం పెంచింది. -
ఈ పాసు పుస్తకాలు అత్యంత ఆధునికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త డిజిటల్ భూ రికార్డుల విధానం గురించి ఏమాత్రం అవగాహనలేకుండా ప్రభుత్వంపై కొందరు ఉద్దేశపూర్వకంగా బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. జగనన్న భూహక్కు, భూరక్ష పథకం కింద ఇచ్చిన పట్టాదారు పాసుబుక్లు ఎందుకు పనికిరావని.. ఇందులో రైతులకు హక్కుల్లేవని, రుణాలు రావంటూ ప్రభుత్వంపై విద్వేషం రగిలిస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కానీ, భూముల రీసర్వే తర్వాత ప్రభుత్వం జారీచేస్తున్న పట్టాదార్ పాసు పుస్తకాలు అత్యంత ఆధునికమైనవని రెవెన్యూ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. రుణాలు తీసుకోవడానికి ప్రస్తుతం ఇస్తున్న పాసు పుస్తకం (భూ హక్కు పత్రం) ఉపయోగపడదనే ప్రచారం అవగాహన రాహిత్యమేననే చెబుతున్నాయి. నిజానికి.. భూములపై యాజమాన్య హక్కును ప్రతిబింబించేది పాసు పుస్తకమే. దాన్ని చూపించి బ్యాంకుల రుణం తీసుకోవడంతోపాటు తనఖా పెట్టుకోవడం, అమ్ముకోవడం వంటివన్నీ గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. రీ సర్వేకు ముందున్న పాస్ పుస్తకంలోని ఉపయోగాల కంటే ఇప్పుడిస్తున్న పాసు పుస్తకాలతో ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ► 2016లో ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించిన తర్వాత భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బహుమతి, తనఖా, లీజు వంటి లావాదేవీలను పాసు పుస్తకంలో రిజిస్ట్రేషన్ అధికారి నమోదు చేయాల్సిన అవసరంలేదు. ► రైతులు రుణాలు తీసుకోవడానికి తమ పాసు పుస్తకాలను బ్యాంకుల్లో ఇవ్వక్కర్లేదు. ► రెవెన్యూ రికార్డులు ఆన్లైన్లో ఉండటంతో పాసు పుస్తకాలను అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండాపోయింది. ► రుణం మంజూరు చేసేటప్పుడు వెబ్ల్యాండ్ ఎలక్ట్రానిక్ రెవెన్యూ రికార్డుల్లో రుణం గురించి నమోదుచేస్తారు. ఈ విషయం తెలుసుకోకుండా కొందరు ఇప్పుడున్న పాసు పుస్తకాల కంటే గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలే మంచివని ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ► నిజానికి.. రీసర్వే ప్రక్రియకు ముందు జారీచేసిన పాసుబుక్లతో పోలిస్తే ప్రస్తుత పాస్బుక్లకే విలువ ఎక్కువ. కొత్త పాసు పుస్తకంతో రుణాలు రాలేదనే ఫిర్యాదు రాలేదు.. ఇక అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి తెలియని విషయం ఏమిటంటే.. జగనన్న భూహక్కు, భూరక్ష పథకం కింద ఇచ్చిన పాసు పుస్తకం (భూహక్కు పత్రం) అత్యంత ఆధునికమైంది. ఇందులో నమోదు చేసిన వివరాలన్నీ ఆన్లైన్లోని వెబ్ల్యాండ్లో ఉన్న వివరాలే. అలాగే.. ► ఈ పాసుబుక్లో భూమికి సంబంధించిన జియో కోఆర్డినేటెడ్ లొకేషన్, భూ కమతం స్కెచ్, యజమాని పేరు వంటివన్నీ ఉంటాయి. డిజిటల్ యుగంలో వచ్చిన కొత్త మార్పు ఇది. ► గతంలో మాదిరిగా పాసు పుస్తకాలు అసలైనవా కాదా? అని ధృవీకరించుకోవాల్సిన అవసరంలేదు. ► పాస్ పుస్తకాల్లేవని, పోయాయని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్లో నమోదైన వివరాలే పక్కాగా ఉంటాయి. ► అంతేకాక.. ఈ కొత్త పాస్ పుస్తకాలను ఫోర్జరీచేసే అవకాశం కూడా లేదు. దొంగ పాస్ పుస్తకాలను సృష్టించడం కుదరదు. ► పాస్ పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీవి సృష్టించడం సాధ్యంకాదు. అందువల్లే ఈ పాస్ పుస్తకంపై భౌతికంగా సంతకాలు అవసరంలేదు. ► ఇలా వివరాలన్నీ ఆన్లైన్లో ఉండడంవల్ల గతంలో మాదిరిగా పాస్ పుస్తకాలు ఒకరి పేరుతో, అడంగల్, 1బీ మరొకరి పేరు మీద ఉండే అవకాశంలేదు. ► అందుకే దీన్ని దేశంలోనే అత్యంత ఆధునికమైన భూరికార్డు విధానంగా పలు రాష్ట్రాలు అంగీకరిస్తున్నాయి. ► ఇక ఈ పాస్ పుస్తకం ద్వారా రుణం రాలేదని, రిజిస్ట్రేషన్ జరగట్లేదని ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. జాయింట్ పట్టాలు ఇవ్వద్దని ఆదేశాలు.. ఇక జాయింట్ పట్టాలపైనా అపోహలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం జాయింట్ ఎల్పీఎంలు (ల్యాండ్ పార్సిల్ మాప్) జారీ చెయ్యొద్దని స్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఆధీనంలో ఉన్న భూమి ప్రకారం, దానిపై హక్కులపై ప్రకారం సబ్ డివిజన్ చేసుకోని సందర్భాల్లో జాయింట్ ఎల్పీఎంలు ఇచ్చారు. గతంలో ఉన్న జాయింట్ పట్టాలవల్ల ఏర్పడిన గొడవలనే ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ధరణి వెబ్సైట్లో అనుభవదారుల హక్కులు కనపడని విధంగా ఏపీలోనూ హక్కులు కనపడడం లేదంటూ ప్రజల్లో అపోహలు పెంచే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో భూ హక్కుల రక్షణ విధానం అత్యంత ఆధునికంగా రూపొందించారు. ఈ విధానం భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచింది. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా చట్టప్రకారం జరుగుతున్న రీ సర్వే ద్వారా పటిష్టమైన భూ హక్కులను రికార్డు చేసే వ్యవస్థ రాష్ట్రంలో రూపొందింది. ఈ విషయాలేవీ తెలుసుకోకుండా కేవలం రాజకీయ కోణంలో సీపీఐ నాయకుడు నారాయణ ఆరోపణలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
ఏపీ వ్యాప్తంగా అందుబాటులోకి ఆటో మ్యుటేషన్
ఏపీ వ్యాప్తంగా అందుబాటులోకి ఆటో మ్యుటేషన్ -
భూ రికార్డుల డిజిటలైజేషన్లో ఏపీ ఆదర్శం
సాక్షి, విశాఖపట్నం: భూ సంబంధిత వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టిర్కీ, సంయుక్త కార్యదర్శి సోన్మోని బోరా ప్రశంసించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల మోడ్రనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన విశాఖలోని ఓ హోటల్లో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రస్తుతం అమలు చేస్తున్న భూ విధానాలు, రికార్డుల నవీకరణ, ఇతర ప్రక్రియల గురించి ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు వివరించారు. దేశమంతటికీ ఒకే వేదికగా మాతృభూమి పేరుతో పైలట్ జియో పోర్టల్ను ఆవిష్కరించారు. అజయ్ టిర్కీ మాట్లాడుతూ సాంకేతికత సహకారంతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు భూ రికార్డులను నవీకరించి మాతృభూమి పోర్టల్కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల భూ రికార్డులను నవీకరించాలని, రాజ్యాంగంలో గుర్తించిన అన్ని భాషల్లోకి అనువదించాలని సూచించారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్తోపాటు అర్హత కలిగిన కొన్ని రాష్ట్రాలకు, జిల్లాలకు భూమి సమ్మాన్ ప్లాటినం సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రదర్శించిన ప్రజంటేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారు. ప్రధానంగా జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా చేపడుతున్న రీ సర్వే వల్ల భవిష్యత్తులో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని టిర్కీ పేర్కొన్నారు. రీ సర్వే, ల్యాండ్ రికార్డుల నవీకరణ, మోడరన్ రికార్డు రూముల నిర్వహణ, భూ సంబంధిత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని ప్రకటించారు. సోన్మోని బోరా మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ప్రాజెక్టుల్లో భాగంగా భూ సంవాద్–6 ప్రాజెక్టు విజయవంతమయ్యేలా అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న భూ సంబంధిత విధానాల గురించి ఏపీ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం కమిషనర్ సిద్ధార్థ జైన్, జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం గురించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతా«దికారులు, ఎన్ఐసీ, ఐటీ టీం అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
81 శాతం భూరికార్డుల స్వచ్ఛీకరణ
సాక్షి, అమరావతి: భూముల రీసర్వే నేపథ్యంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల స్వచ్చికరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్) రాష్ట్రవ్యాప్తంగా 81 శాతం పూర్తయింది. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూహక్కు పథకం పేరుతో నిర్వహిస్తున్న రీసర్వేలో రికార్డుల ప్రక్షాళన అత్యంత కీలకంగా మారింది. రీసర్వే ప్రారంభించాలంటే రికార్డులను అప్డేట్ చేయడం తప్పనిసరి. వెబ్ల్యాండ్ అడంగల్లను ఆర్ఎస్ఆర్తో పోల్చి చూడడం, అడంగల్లో పట్టాదారు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం, పట్టాదారు, అనుభవదారుల వివరాల కరెక్షన్, అప్డేషన్, పట్టాదారు డేటాబేస్ను అప్డేట్ చేయడం వంటివన్నీ కచ్చితంగా పూర్తిచేయాల్సి ఉంది. రెవెన్యూ యంత్రాంగం ఇవన్నీ పూర్తిచేసిన తర్వాతే సర్వే బృందాలు రీసర్వే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే రికార్డుల స్వచ్చికరణపై ప్రత్యేకదృష్టి సారించి చేస్తున్నారు. 26 జిల్లాల్లోని 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేపట్టారు. ఇప్పటివరకు 14,235 గ్రామాల్లో (81 శాతం) పూర్తయింది. అల్లూరి జిల్లాలో 25 శాతం మాత్రమే అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణను పూర్తిచేశారు. అనంతపురం జిల్లాలో 504 గ్రామాలకు 504, కర్నూలు జిల్లాలో 472కి 472, నంద్యాల జిల్లాలో 441కి 441 గ్రామాల్లో స్వచ్చికరణ పూర్తయింది. చిత్తూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 99 శాతం స్వచ్చికరణ పూర్తయింది. ఈ జిల్లాల్లో రెండేసి గ్రామాల్లో మాత్రమే ఇంకా పూర్తికావాల్సి ఉంది. సత్యసాయి, తూర్పుగోదావరి, ప శ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో 98 శాతం స్వచ్ఛీకరణ పూర్తయింది. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 25 శాతం స్వచ్ఛీకరణనే పూర్తిచేయగలిగారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో 44 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61 శాతం స్వచ్చికరణ పూర్తయింది. రెండునెలల్లో అన్ని జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణ పూర్తిచేసేందుకు రెవెన్యూశాఖ ప్రణాళిక రూపొందించి పనిచేస్తోంది.
Related News by category
-
దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత నారా చంద్రబాబు యుక్తాయుక్త విచక్షణ మరిచి ‘రాళ్లతో కొట్టండి.. కర్రలతో బాదండి..’ అని సెలవిస్తే పచ్చదండు ఊరుకుంటుందా? ‘నిన్ను చంపితే ఏం చేస్తావ్..’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ నేతల గత వైఖరిని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ‘ఓటు వేయకుంటే పోటు.. అడ్డు తగిలితే వేటు’.. స్థూలంగా చెప్పాలంటే టీడీపీ సిద్ధాంతం ఇదే. ప్రజల ఆశీస్సులతో గద్దెనెక్కాలనే ఆలోచనకే తావు లేకుండా తమకు తెలిసిన ‘దండన’ విద్యనే పచ్చ నేతలు నమ్ముకున్నారు. నిత్యం తగువులే తలంపుగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పారీ్టల నాయకులు, కార్యకర్తలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో టీడీపీ నేతల వికృత క్రీడకు బలైన రాజకీయ నాయకులు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారు. అంతకు పది రెట్ల మంది అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. పచ్చటి పల్లెల్లో చిచ్చుపెట్టడమే కాకుండా తమ అహానికి, అవినీతికి అడ్డు వస్తున్నారనే కారణంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు మళ్లీ బరితెగించారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారాన్ని అడ్డంపెట్టుకుని పచ్చమూకలు రెచ్చిపోయాయి. పల్లెల్లో దాడులకు తెగబడ్డాయి. తమకు అడ్డువస్తే అంతమొందించడమే లక్ష్యంగా రెచ్చిపోయాయి. నేడు అధికార పక్షంపై వికృత రాతలతో శునకానందాన్ని పొందుతున్న పచ్చమీడియా నాడు కళ్లుండి చూడలేదని కబోదుల్లా చోధ్యం చూశాయి. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అరాచకాల్లో కొన్ని ప్రధాన ఘటనలు ఎంపీటీసీ భర్తను చంపారు 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిపూడి మండలం కెల్లంపల్లి సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా తేలుకుట్ల గురవమ్మ పోటీ చేశారు. ఏప్రిల్ 11న గోసుకొండ అగ్రహారంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడటంతో గురవమ్మ భర్త వెంకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఒంగోలులో చికిత్స ΄పొందుతూ మృతి చెందారు. ఏడాది వ్యవధికే దిగులుతో గురవమ్మ కూడా కన్నుమూసింది.దాడులకు అంతే లేదు..పీసీపల్లిలో 2017 జూలైలో వైఎస్సార్ సీపీ ఎంపీపీ బత్తుల అంజయ్యపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. 2015 ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా నారాయణ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై ప్రశ్నించిన అప్పటి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్తోపాటు మరో ఏడుగురిపై అక్రమంగా కేసులు బనాయించారు. కొండపి నియోజకవర్గంలో అయ్యప్పరాజుపాలెంలో ఎంపీటీసీ ఎన్నికల రోజున ఐదుగురిపై దాడి చేసి గాయపరిచారు. జరుగుమల్లి మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.జయబాబుపై టీడీపీ నేతలు దుర్మార్గంగా రేప్ కేసు పెట్టించారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో సాధారణ ఎన్నికల సమయంలో వెంకట్రావు అనే వ్యక్తి ఏజెంట్గా కూర్చున్నాడని అతనికి చెందిన రూ.5 లక్షల విలువ చేసే పొగాకును టీడీపీ నాయకులు తగలబెట్టారు. 2014లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సమయంలో టీడీపీ బరితెగించింది. మార్కాపురం జెడ్పీటీసీ రంగారెడ్డి ఓటింగ్లో పాల్గొనకుండా చేసేందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పేరుతో అరెస్టు చేయించారు. గాజులపల్లెలో దాష్టీకం2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని పుల్లలచెరువు మండలం మర్రివేముల నుంచి ఆ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలో గాజులపల్లెలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను రెచ్చగొట్టడమే కాకుండా మర్రివేముల నుంచి 100 మంది టీడీపీ కార్యకర్తలను తీసుకెళ్లి దమనకాండ సృష్టించారు. ఇళ్లలోకి చొరబడి ఆడామగా తేడా లేకుండా బయటకు లాక్కుని వచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారు. బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల సొమ్ము లూటీ చేశారు. మమ్ము రమణ అనే నిండు గర్భిణిని కాలితో తన్నడంతో ఆమెకు అబార్షన్ చేయాల్సి వచ్చింది. మమ్ము చిన్న అంజయ్య అనే వ్యక్తిపై దాడి చేయడంతో ఎముకలన్నీ విరిగి ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. సుమారు పది వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పురుగుమందు డబ్బాలు తెచ్చి కొందరిపై పోసి రాక్షసానందం పొందారు. రాళ్లదాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త బలి పొన్నలూరు మండలంలోని లింగంగుంట గ్రామంలో 2018 సెపె్టంబర్లో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు రంగునీళ్లు చల్లి రెచ్చగొట్టారు. మరుసటి రోజు ఉదయం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కొందరు బహిర్భుమికి వెళ్లి వస్తున్న సమయంలో మాటువేసిన టీడీపీ నాయకులు కొందరు ఇంటిపైకి ఎక్కి ఒక్కసారిగా ఇటుక రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎనిమిరెడ్డి పెదబ్రహ్మయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.రెచ్చగొట్టి.. అక్రమ కేసులు పెట్టి.. ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో ఆలూరి శ్రీహరి ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని 2019లో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్ పెట్టడమే కాకుండా, బూతులు తిడుతూ.. తొడలు చరుస్తూ టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. దాడికి దిగడమే కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి బాలినేనితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్రెడ్డి, మరికొందరిపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టించారు. కమ్మపాలెంలో దళితులు నివసించే ప్రాంతాల్లో డ్రెయినేజీ, రోడ్లు, పబ్లిక్ టాయ్లెట్కు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా టీడీపీ నేతలు అడ్డుపుల్ల వేశారు. కమ్మపాలెంలో 119 మంది దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లోకి వారిని వెళ్లనివ్వకుండా దామచర్ల అడ్డుకున్నారు. దళితులు మొత్తుకుంటున్నా వినకుండా ఆ స్థలంలో గుండా డ్రెయినేజీ నిర్మించి జులుం ప్రదర్శించారు. ఒంగోలు సమతా నగర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రచారానికి ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలిన పచ్చ మందలో మేడికొండ మోహన్రావు, ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చౌదరి, ఆయన భార్య కీలకంగా ఉన్నారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఏఆర్ కానిస్టేబుల్ భార్య మాట్లాడిన బూతులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయిన రోజున బండ్లమిట్టలోని దుకాణాలపై టీడీపీ నేతలు తెగబడ్డారు. ఓ ముస్లిం యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా, దుకాణం షట్టర్ మూతవేసి హల్చల్ చేశారు. గాయపడిన ముస్లిం యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడిలో కీలక సూత్రధారి, సమతానగర్లో రచ్చకు కారణమైన మేడికొండ మోహన్రావే. నగరంలో రాజకీయ ఘర్షణలు ఎక్కడ జరిగినా మోహన్రావు పేరే ప్రధానంగా వినిపిస్తోంది. మోటా నవీన్ అనే ఎస్టీ యువకుడిని చితకబాది ముఖంపై మూత్రం పోసిన కేసులో నిందితుడు రామాంజనేయ చౌదరికి ఆశ్రయం కలి్పంచి పోలీసులకు చిక్కకుండా కొద్ది రోజులపాటు అడ్డుపడింది మోహన్రావే అన్న ఆరోపణలున్నాయి. దాడి కేసులో జైలుకు వళ్లి వచ్చిన మోహన్రావును ముందు పెట్టి దామచర్ల జనార్దన్ ఆడిస్తున్న డ్రామాలను ఎల్లో పత్రిక ప్రముఖంగా ప్రచురించడం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. -
తాగి..తూగి
యర్రగొండపాలెం: టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు నామినేషన్ దాఖలు సందర్భంగా శుక్రవారం పట్టణంలో మద్యం ఏరులై పారింది. నామినేషన్కు ముందు పట్టణంలో టీటీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలకు ముందుగానే మద్యం కేసులతోపాటు డబ్బులు కూడా ఇచ్చారు. వారికి మాంసంతో కూడిన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పట్టణంలో ఏ సందులో చూసిన తెలుగు తమ్ముళ్లు మద్యం తాగుతూ కనిపించారు. బ్రాందీ షాపుల వద్ద క్యూ కట్టారు. ఫూటుగా మద్యం తాగిన వీరు ర్యాలీలో చిందులు తొక్కారు. ర్యాలీలో పాల్గొన్నవారి సంఖ్య అంతంత మాత్రమే అయినా పచ్చ నేతలు మాత్రం నియోజకవర్గం అంతా తమ వెనకే నడుస్తుందన్న బిల్డప్ ఇచ్చారు. తాగిన మైకంలో వారు పట్టణంలో ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ తో హల్చల్ చేశారు. ఒక ద్విచక్ర వాహనంపై త్రిపురాంతకం మండలంలోని మానేపల్లికి చెందిన ముగ్గురు మితిమీరిన వేగంగా నడుపుతూ రామసముద్రానికి సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బోల్తాపడ్డారు. ఈ సంఘటనలో బైరెడ్డి నరసింహారెడ్డి, పోట్ల మల్లికార్జునరెడ్డిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని యర్రగొండపాలెంలోని టీడీపీ నాయకుడు మన్నె రవీంద్రకు చెందిన వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించారు. గాయపడిన వారిలో బైరెడ్డి నరసింహారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ఆ వైద్యశాలలో ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. యర్రగొండపాలెంలో ఏరులై పారిన మద్యంకనిపించని కూటమి జెండాలు.. టీడీపీ ర్యాలీలో కూటమి జెండాలు కనిపించలేదు. ర్యాలీని రక్తికట్టించటానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాలు ఏర్పాటు చేసి జనసమీకరణ చేశారు. వారు అనుకున్న మేరకు కార్యకర్తలు రాకపోయినా స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్నీ పచ్చజెండాలే కనిపించాయి కానీ జనసేన, బీజేపీలకు చెందిన జెండాలు కనిపించలేదు. ఈ సందర్భంగా స్థానిక కొలుకుల సెంటర్లో కాన్వాయ్పై నుంచి ఎరిక్షన్బాబు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తమ ప్రసంగాల్లో టీడీపీ కార్యకర్తలతోపాటు జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారని, ఎమ్మార్పీఎస్ తమకు మద్దతు ఇస్తుందని ఆయా పార్టీలకు చెందిన నాయకులను మాత్రం పరిచయం చేశారు. -
మంచి ముహూర్తం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు అర్బన్: నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు శుక్రవారం ఏకాదశి మంచి రోజు కావడంతో జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒంగోలు పార్లమెంట్కు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 15 నామినేషన్లు వచ్చాయి. జిల్లాలో అధికార వైఎస్సార్ సీపీ, టీడీపీకి చెందిన పలువురు అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. జనసంద్రమైన గిద్దలూరు: వైఎస్సార్ సీపీ గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా మార్కాపురం ఎమ్మెల్యే కేపీ.నాగార్జున రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో నిర్వహించిన భారీ ర్యాలీలో ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి కుందురు నాగార్జున రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కుందురు కల్పన కూడా వైఎస్సార్ సీపీ తరఫున మరో సెట్టు దాఖలు చేశారు. కొండపిలో మంత్రి ఆదిమూలపు తరుఫున.. కొండపి అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తరఫున కొండపి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు కొండపి తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఏ.కుమార్కు మధ్యాహ్నం 12.25 గంటలకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ నామినేషన్ను ప్రపోజ్ చేసిన వారిలో రాష్ట్ర వైఎస్సార్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎన్నాబత్తిన వెంకటేశ్వర రావు(చిన్నా), రాష్ట్ర నాయకులు డాకా పిచ్చిరెడ్డి, కొండపి జెడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి అరుణ కుమారి రెడ్డి, పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ వెంకటేశ్వర్లు ఉన్నారు. అసెంబ్లీకి పలువురు నామినేషన్లు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీడీపీ తరుఫున యర్రగొండపాలెం అసెంబ్లీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దర్శి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా లక్ష్మీ గొట్టిపాటి ఒక సెట్టు నామినేషన్ వేశారు. సంతనూతలపాడు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా బొమ్మాజి నిరంజన్ విజయ కుమార్ ఒక సెట్టు, కొండపి అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున డోలా కుటుంబ సభ్యులు డోలా రాజేశ్వరి కూడా ఒక సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గిద్దలూరు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. గిద్దలూరుకు స్వతంత్ర అభ్యర్థులు లక్ష్మీ రామ నాయక్ ముదావత్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున జువ్వాది పవన్ కుమార్, మార్కాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పొట్టి వెంకట సుబ్బారావు, ఒంగోలు అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా బుట్టి రమేష్ బాబు, స్వతంత్ర అభ్యర్థిగా మన్నం సుధీర్ కుమార్లు నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రెండు రోజులు కలిపి మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. అశోక్రెడ్డిపై దొమ్మీ కేసు.. వాహన దగ్ధం, దొమ్మీ..ట్రెస్పాస్ కేసులు.ఇవీ గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి చరిత్ర. అశోక్రెడ్డిపై గిద్దలూరు పోలీస్స్టేషన్లో పలు సెక్షన్ల కింద ఉన్నాయి. అలాగే బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదై ఉంది. అశోక్రెడ్డి వద్ద రూ.3.50 లక్షల నగదు, భార్య పుష్పలీలా వద్ద రూ.6.68 లక్షల నగదు చేతిలో ఉన్నట్లు ఆఫిడవిట్లో చూపించారు. అశోక్రెడ్డి పేరుపై రూ.3.93 కోట్లు, భార్య పేరుపై రూ.2.59 కోట్లు చరాస్తులు చూపించారు. ఇద్దరి వద్ద సుమారు రూ.4.40 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.స్వామికి ఉంది డొక్కు కారేనట మరుగుదొడ్ల సొమ్మును భారీగా కాజేసిన కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజస్వామికి 2013 మోడల్ మారుతి కారు మాత్రమే ఉందని ఆఫిడవిట్లో పొందుపరిచాడు. తన దగ్గర రూ.1.26 లక్షల నగదు, తన భార్య వద్ద రూ.27 వేల నగదు మాత్రమే ఉన్నట్లు చూపించాడు. భార్యభర్తల పేరుపై రూ.47 లక్షల విలువైన చరాస్తులు, సుమారు రూ.35 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు చూపించాడు. స్వామిపై వివిధ పోలీస్స్టేషన్లలో 9 కేసులు నమోదై ఉన్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీగా సొమ్ము కాజేసిన స్వామి..ఎన్నికల ఆఫిడవిట్లో చూపిన వివరాలు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. -
పేదలకు విద్య, వైద్యం అందించటమే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: పేదలకు విద్య, వైద్యం సంతృప్తిగా అందించటమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 58 నెలల పాలనలో ముందుకు సాగిందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఈ మేరకు బాలినేని మన ఒంగోలు–మన వాసన్న కార్యక్రమంలో భాగంగా బాలాజీ నగర్లో శుక్రవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణంతో కలిసి అగ్రహారం గేటు అవతల బత్తులవారికుంట, బ్రాహ్మణ బజారు, వార్డు సచివాలయం వీధి, మిట్టమీద, దత్తాత్రేయ కాలనీ, అరవ కాలనీలలో నుంచి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాలినేనికి స్థానికులు హారతులు, పూల వర్షంతో, గుమ్మడి కాయలు దిష్టి తీసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ సామాన్యులు అనారోగ్యం పాలైతే ఆర్ధిక స్థోమత లేనప్పుడు అప్పులు చేసి మరీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఆ పరిస్థితికి చరమగీతం పాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్య శ్రీలో అవకాశం కల్పించటంతో పాటు ఆరోగ్య శ్రీ ఖర్చు దాదాపు రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అదేవిధంగా విద్య విషయంలో కూడా సీఎం వైఎస్ జగన్ ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంతో పాటు నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని గుర్తు చేశారు. వాటితో పాటు అమ్మ ఒడి పేరుతో పిల్లలను పనికి పంపకుండా బడికి పంపేందుకు ఆర్థిక సాయం చేయటం కూడా మరెక్కడా లేదన్నారు. చిన్నారులకు బూట్ల నుంచి దుస్తులు, సాక్సులు, టై అందజేసి విద్యను ప్రోత్సహిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను గడప ముంగిటకే తీసుకొచ్చి పరిపాలనను గ్రామాల్లోనే కొనసాగించారని చెప్పారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానన్నారు. రానున్న ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించి ఆరోసారి గెలిపించి తనచేత సిక్సర్ కొట్టించాల్సిన బాధ్యత ఒంగోలు నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటి వద్ద బాలినేని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణం, డివిజన్ అధ్యక్షుడు పోట్లూరి భాస్కర్, అడపాల రాము, వాకా కృష్ణారెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, తమ్మినేని మాధవి, నారాయణ, తోటకూర రాజేష్, వంశీకృష్ణ, వెంకటేశ్వర్లు, సురేష్, కుమార్, ఇసాకు, ఏసు, విజయ్, వంశీ, పాజర్ల నాగరాజు, అశోక్ బాబు, సుబ్బయ్య, బాల గురవయ్య, పురిణి ప్రభావతి, లక్ష్మయ్య, గుర్రాల రామ్మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఒంగోలు నగరంలోని 16వ డివిజన్లో ‘మన ఒంగోలు–మన వాసన్న’ -
వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యం
సంతనూతలపాడు (చీమకుర్తి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన ప్రభంజనం సృష్టిస్తూ దూసుకెళ్తోందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యమని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, బాపట్ల పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి అన్నారు. సంతనూతలపాడు పంచాయతీ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో శుక్రవారం వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మోదుగుల మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారని.. చంద్రబాబు తన పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని చెప్పారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ఉత్తుత్తి వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ముందుకొస్తున్నారని ఎద్దేవా ఏశారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగార్జునను, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని, పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈనెల 24 న చీమకుర్తిలో తాను నామినేషన్ వేస్తానని, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మారెళ్ళ బంగారు బాబు, ఎంపీపీ బీ విజయ, జెడ్పీటీసీలు దుంపా రమణమ్మ, వేమా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బొల్లినేని కృష్ణయ్య, సొసైటీ ప్రెసిడెంట్ దుంపా యలమందారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, పేర్నమిట్టలోని 6 డివిజన్ల కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జేసీఎస్ కన్వీనర్లు, చీమకుర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పీఏసీఎస్ త్రి మెన్ కమిటీ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, పాల్గొన్నారు. సంతనూతలపాడులో విజయం సాధించి జగనన్నకు బహుమతిగా ఇస్తాం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ కార్యాలయం ప్రారంభం
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
బ్రిజ్భూషణ్కు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్ ఎంపీకి నో ఛాన్స్
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement