నెల్లూరు : జిల్లాలో ఖాళీ భూములు భారీగా ఉన్నా.. ఆక్రమణల చెరలో చిక్కాయి. ఫలితంగా ప్రజావసరాలకు.. పారిశ్రామిక అవసరాలకు భూముల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకునే దిశగా రెవెన్యూ యంత్రాంగం అడుగులు వేస్తోంది. నీతి ఆయోగ్ కమిటీ పర్యటన అనంతరం ఖాళీ భూముల గుర్తిం పు.. వాటి రక్షణపై కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు దృష్టి సారించారు. ల్యాండ్ బ్యాంక్ పేరిట భూముల సంరక్షణ దిశగా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 70 వేల ఎకరాలకు పైగా ఖాళీ భూములు ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు చెబు తున్నాయి.
రెండు నెలల క్రితం నీతి ఆయోగ్ కమిటీ, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ బృందం కృష్ణపట్నం తీరంలో పర్యటించి ఖాళీ భూముల విని యోగం, తదితర అంశాలను పరిశీలించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు రంగంలోకి దిగి వివాదాలు, కోర్టు పరిధిలో లేని 26 వేల ఎకరాల ఖాళీ భూములను గుర్తించారు. మరో 44 వేల ఎకరాలు ఉన్నప్పటికీ వాటిలో అధిక శాతం ఆక్రమణ చెరలో ఉన్నట్టు గుర్తించారు. మరికొన్ని కోర్టు వివాదాలు, ఇతర సమస్యలతో ముడిపడి ఉన్నాయి.
ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు
జిల్లాలోని ఖాళీ భూములను గుర్తించి.. వాటి సంరక్షణకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నిర్ణయించారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ, దేవాదాయ, పోరంబోకు తదితర అన్నిరకాల భూముల్ని గుర్తించే ప్రక్రియను రెండు నెలల క్రితం చేపట్టారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు సమీపంలోని మండలాల్లో ఎక్కువగా భూములు ఉన్నట్టు గుర్తించారు. కోర్టు వివాదాలు, ఇతర ఇబ్బందులు లేని భూములు 26 వేల ఎకరాలు ఉండగా.. వాటిలో అధిక శాతం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆ«ధీనంలో ఉన్నాయి. మరికొన్ని భూములను పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట ఖాళీగా ఉంచారు. ఇదిలావుంటే.. రిలయన్స్తో సహా అనేక పరిశ్రమలకు గతంలో భూములు కేటాయించారు. వీటిలో కొన్ని పరిశ్రమలు స్థాపన కాలేదు.
ప్రస్తుతం వివాదం లేకుండా నేలటూరుపాలెంలో రిలయన్స్ ఆధీనంలో ఉన్న 44 ఎకరాల భూమిని అధి కారులు స్వాధీనం చేసుకున్నారు. ముత్తుకూరు మండలంలో 350 ఎకరాల చౌడు భూములు ఉన్నట్టు గుర్తిం చారు. గరిమెనపెంట, మర్రిపాడు, రాపూరు మండలాల్లో వందలాది ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పనిలో పనిగా ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాం డ్ రికార్డ్ ప్రక్రియ చేపట్టారు. ఇందుకోసం కొత్తగా సాఫ్ట్వేర్ను రూపొం దించి.. ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.
కేంద్ర బృందాల పరిశీలన
ఏడాది జూన్ 12న కృష్ణపట్నం తీర ప్రాంతంలో నీతిఆయోగ్ కమిటీ పర్యటించింది. జిల్లాలో ఖాళీ భూములు, పరిశ్రమల స్థాపనకు ఉన్న సౌకర్యాలు, ఇతర అంశాలపై ఏరియల్ సర్వే నిర్వహించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారుల బృందం కూడా పర్యటించింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను ఈ బృందాలు పరిశీలించాయి.
భూములు బోలెడు
Published Thu, Aug 3 2017 12:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement