గుండెపోటుతో కౌలు రైతు మృతి | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో కౌలు రైతు మృతి

Published Mon, Jun 27 2016 7:41 PM

Lease farmer died of a heart attack

పత్తి విత్తనాలు మొలకెత్తక పోవడంతో కలత చెందిన కౌలు రైతు గుండె పోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా శాయంపేటలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన ఉప్పుల విజేందర్(36) మేస్ర్తీ పనులు చేసుకుంటూనే రెండెకరాలు పొలం కౌలు తీసుకున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు వేశాడు. తర్వాత వర్షం ముఖం చాటేయడంతో విత్తనాలు సక్రమంగా మొలవలేదు. దీంతో కలత చెందాడు. ఇదే విషయాన్ని ఉదయం కుటుంబ సభ్యులతో చెబుతూ.. గుండె పోటుతో అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించే లోపే మృతి చెందాడు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement