లైఫ్‌ స్టైల్ ఎక్స్‌పో | Sakshi
Sakshi News home page

లైఫ్‌ స్టైల్ ఎక్స్‌పో

Published Fri, Sep 23 2016 9:40 PM

లైఫ్‌ స్టైల్ ఎక్స్‌పో - Sakshi

సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి:  ప్రముఖ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ స్టుడెంట్‌మగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎస్‌ఐపిఎల్‌) నగరంలో తమ 2వ లైఫ్‌సై్టల్‌ ఎక్స్‌పో ఏర్పాటు చేసింది. కూకట్‌పల్లిలోని ఫోరమ్‌ సుజనామాల్‌లో ఏర్పాౖటెన ఈ అత్యాధునిక ఉత్పత్తుల ప్రదర్శనను సినీ నటి యామిని భాస్కర్‌ శుక్రవారం ప్రారంభించారు.

కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ విభిన్న రకాల కేటగిరీల కింద లభించే బ్రాండ్స్‌ను ఒకే చోట అందించడంతో పాటు వాటి మార్కెట్‌ స్థితిగతులకు సంబంధించిన తొలి దశ సమాచారం ఈ ఎక్స్‌పోలో లభిస్తుందన్నారు. 3 రోజులు కొనసాగే ఎక్స్‌పో ఈవెంట్స్‌లో శనివారం ఎత్నిక్‌ వేర్‌ ఫ్యాషన్‌ షో ఆదివారం లైవ్‌ స్టాండప్‌ కామెడీ షో నిర్వహించనున్నారు.                                                    

Advertisement

తప్పక చదవండి

Advertisement