టీడీపీ నేతను చితకబాదిన స్థానికులు | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతను చితకబాదిన స్థానికులు

Published Fri, Sep 4 2015 10:07 PM

టీడీపీ నేతను చితకబాదిన స్థానికులు - Sakshi

శ్రీకాళహస్తి: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన టీడీపీ నేతకు స్థానికులు దేహశుద్ది చేశారు. చిత్తూరు జిల్లాకి చెందిన టీడీపీ నేత ధర్మారెడ్డి మద్యం మత్తులో శుక్రవారం రాత్రి వీరంగం సృష్టించాడు. తన భార్య 33వ వార్డు కౌన్సిలర్ నాగమణిని రాముల వారి గర్భగుడిలోకి వెళ్లనివ్వలేదని ధర్మారెడ్డి రభస చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ధర్మారెడ్డిని  చితకబాదారు.

ఈ దాడిలో ధర్మారెడ్డి తలకు తీవ్రగాయాలవడంతో దగ్గర్లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 

Advertisement
Advertisement