పిచ్చి కుక్క దాడి..ఆరుగురికి గాయాలు | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్క దాడి..ఆరుగురికి గాయాలు

Published Wed, May 17 2017 9:51 PM

పిచ్చి కుక్క దాడి..ఆరుగురికి గాయాలు - Sakshi

–మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు
నందికొట్కూరు: పిచ్చికుక్క దాడిలో బుధవారం.. ఆరుగురు గాయపడ్డారు.గాయాలపాలైన వారిలో నందికొట్కూరు పట్టనం రాములవీధికి చెందిన మహాలక్ష్మి అనే బాలిక, శ్రీనివాసులు, లక్ష్మీ, పద్మావతి, కృష్ణమ్మ, పాతిమాబీలు ఉన్నారు.కుక్క కాటుకు గురైన బాలికకు స్థానిక వైద్యశాలో చికిత్స నిర్వహించి మైరుగైన వైద్యంకోసం కర్నూలుకు రెఫర్‌ చేశారు. మిగతా ఐదుగురికి స్థానిక ప్రభుత్వ వైద్యశాల్లో వైద్యులు వైద్యం అందించారు. గాయపడిన బాలికను తల్లిదండ్రులు మున్సిపల్‌ కమిషనర్‌ వద్దకు తీసుకేళ్లి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ఎన్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో 777 కుక్కలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిలో 307 కుక్కలకు ఏబీసీ ఆపరేషన్‌ చేయించామన్నారు.  పిచ్చి కుక్కను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు.
 

Advertisement
Advertisement