మల్లన్న హుండీ ఆదాయం రూ.1.29 కోట్లు | Sakshi
Sakshi News home page

మల్లన్న హుండీ ఆదాయం రూ.1.29 కోట్లు

Published Sat, Dec 10 2016 9:13 PM

మల్లన్న హుండీ ఆదాయం రూ.1.29 కోట్లు - Sakshi

శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయదేవాలయాల్లోని 15 రోజుల హుండీ ఆదాయం రూ.1,29,41,864 వచ్చినట్లు ఈఓ నారాయణభరత్‌ గుప్త తెలిపారు. శనివారం అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన ఈ లెక్కింపులో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నగదుతో పాటు  36.650 గ్రాముల బంగారు, 2.150 కిలో గ్రాముల వెండి వచ్చిందన్నారు. గత నెల 25 నుంచి శనివారం వరకు వచ్చిన ఆదాయంగా ఈఓ పేర్కొన్నారు.    

Advertisement
Advertisement