భార్య, అత్తపై దాడి చేసి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

భార్య, అత్తపై దాడి చేసి ఆత్మహత్యాయత్నం

Published Thu, Sep 1 2016 11:21 PM

భార్య, అత్తపై దాడి చేసి ఆత్మహత్యాయత్నం - Sakshi

∙చికిత్స కోసం రాజమహేంద్రవరం తరలిస్తుండగా భార్య మృతి
∙ఆస్పత్రిలో కోలుకుంటున్న అత్త, నిందితుడు
రాజమహేంద్రవరం క్రైం: భార్య, అత్తపై దాడి చేసి భార్య మరణానికి కారకుడైన వ్యక్తి తననూ గాయపరచుకొని ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. తుని మండలం కలవపాడు గ్రామానికి చెందిన బోజంకి నర్సిం హమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వరలక్ష్మి (30) అలియాస్‌ వరమ్మని పదహారేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహం అయిననాటి నుంచి నర్సింహమూర్తి భార్యను వేధిస్తున్నాడు. ఆనేపథ్యం లో వరలక్ష్మి రెండు నెలలుగా కొవ్వూరులోని తన పుట్టింటిలో ఉంటోంది. నరసిం హమూర్తి గురువారం  కత్తితో వరలక్ష్మిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ సందర్భంగా అత్త మాసవరపు అచ్చియ్యమ్మపై కూడా దాడి చేసి గాయపర్చాడు. అనంతరం అదే కత్తితో తన మెడపై గాయపరచుకున్నాడు. గాయపడిన ఆ ముగ్గురినీ 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా రోడ్‌ కం రైల్‌ బ్రిడ్జిమీదకు వాహనం వచ్చేసరికి వరలక్ష్మి మృతి చెందింది. గాయాలపాలైన అచ్చియమ్మ, నర్సింహమూర్తి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement