ఎదురెదురుగా ఢీకొన్న బైక్లు
యువకుడు దుర్మరణం
మరో ముగ్గురికి గాయాలు
మరికొన్ని గంటల్లో గంజుకుంటమ్మ (మారెమ్మ) జాతర సÜంబరంగా జరుపుకోవాల్సి ఉంది. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. ఇంతలో పిడుగులాంటి వార్త. రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబ సభ్యుడు ఒకరు దుర్మరణం చెందారు. జాతరకొచ్చి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. దేవుడా.. ఎంత పని చేశావయ్యా అంటూ మృతుడి తల్లిదండ్రులు, సోదరీమణులు విలపించారు.
కళ్యాణదుర్గం: ఎర్రంపల్లి గేటు వద్ద బుధవారం వేగంగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కుర్లపల్లికి చెందిన బొజ్జన్న (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో కుర్లపల్లికి చెందిన శిల్ప, కామక్కపల్లికి చెందిన నరసింహులు, కంబదూరుకు చెందిన నారాయణస్వామిలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కుర్లపల్లికి చెందిన అగులూరప్ప, రామలక్ష్మమ్మ దంపతులకు కుమారుడు బొజ్జన్నతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బొజ్జన్న ఎనిమిదేళ్లుగా బెంగళూరులో తన చిన్నాన్న గోవిందు వద్ద ప్లెక్సీల ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్నాడు. మారెమ్మ జాతర కోసం మంగళవారం స్వగ్రామానికి వచ్చాడు. పండుగ పనులలో భాగంగా బుధవారం తనబంధువు అయిన హనుమంతప్ప కూతురు శిల్పతో కలిసి ద్విచక్రవాహనం (స్పోర్ట్స్ బైక్)లో స్వగ్రామం నుంచి కళ్యాణదుర్గానికి బయల్దేరాడు.
కంబదూరుకు చెందిన నారాయణస్వామి తన మిత్రుడైన కామక్కపల్లికి చెందిన నరసింహులును ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని కళ్యాణదుర్గం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. కళ్యాణదుర్గం – కంబదూరు ప్రధాన రహదారిలో ఎర్రంపల్లి గేటు సమీపంలో రెండు ద్విచక్రవాహనాలూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొజ్జన్న అక్కడికక్కడే మృతి చెందాడు. శిల్ప తలకు బలమైన గాయమైంది. నారాయణస్వామి తలకు తీవ్ర రక్తగాయాలవగా.. నరసింహులుకు ఎడమకాలు విరిగిపోయింది. ముగ్గురినీ కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. కాగా నారాయణస్వామి, శిల్పల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. టౌన్ ఎస్ఐ శంకర్రెడ్డి కేసు దర్యాప్తుచేస్తున్నారు.
జాతరకొచ్చి కానరాని లోకాలకు..
Published Wed, Aug 23 2017 10:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement