రైలు ఢీకొని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Published Sun, Aug 13 2017 10:45 PM

man dies of train accident

సోమందేపల్లి: పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. జూలకుంట గ్రామానికి చెందిన లక్ష్మయ్య (45) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శనివారం సోమందేపల్లికి వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయల్దేరాడు. అదే రోజు రాత్రి బ్రాహ్మణపల్లి రైల్వేగేటు వద్ద ట్రాక్‌ దాటుతున్న సమయంలో రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భార్య నాగమ్మ, తన ఇద్దరు పిల్లలతో సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement
Advertisement