చిత్తూరు జిల్లా : ఎమ్మార్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణనగర్లో బుధవారం మధ్యాహ్నం వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వెస్టు డీఎస్పీ కనకరాజు, ఎమ్మార్పల్లి సీఐ మధు కథనం మేరకు...తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీ నల్లమానుకాలువ గ్రామానికి చెందిన జ్యుడిషియల్ ఉద్యోగి కుమారస్వామిరెడ్డి, ప్రశాంతి దంపతుల కుమార్తె దివ్య(25)ను ఐదేళ్ల క్రితం తిరుపతికి చెందిన శివకుమార్రెడ్డి, యశోదమ్మ దంపతుల కుమారుడు శశికాంత్రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు.
వీరికి మోహిత్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరి కాపురం కొన్నేళ్లు సజావుగా సాగింది. కొద్ది రోజులుగా శశికాంత్రెడ్డి కట్నం తీసుకురమ్మని భార్యను వేధించసాగాడు. అవి ఎక్కువ కావడంతో బుధవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఉరేసుకుని మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
భర్త, అత్త చంపారు
దివ్యను ఆమె భర్త, అత్త ఇద్దరూ కలిసి చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. బుధవారం ఉదయం మా ఇంటికొచ్చి మాతో సంతోషంగా గడిపిందని, మధ్యాహ్నం అత్తారింటికి వెళ్లిన కాసేపట్లోనే శవంగా మారిందని వాపోయారు. వరకట్నం తీసుకురాలేదన్న కోపంతోనే తమ బిడ్డను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేరకు సీఐ మధు వరకట్న వేధింపుల కింద భర్త, అత్తపై కేసు నమోదు చేశారు. వెస్టు డీఎస్పీ కేసు దర్యాప్తు చేపట్టారు.
అత్తారింటికి వెళ్లిన కాసేపట్లోనే...
Published Thu, Jul 7 2016 9:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement