♦ వివాహిత అనుమానాస్పద మృతి
♦ చెరువులో తేలిన మృతదేహం
♦ కట్నం కోసం కొట్టి చంపారన్న బంధువులు
♦ మద్నూర్ పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన
మద్నూర్(జుక్కల్) :
ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో చెరువులో మృతదేహామై తేలింది. అయితే, అదనపు కట్నం కోసం భర్తే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీ కరిస్తున్నాడని పుట్టింటి వారు ఆందోళనకు దిగారు. దీంతో సోమవారం మద్నూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాన్సువాడ డీఎస్పీ నరసింహరావు కథ నం ప్రకారం.. జుక్కల్ మండలంలోని నాగుల్గావ్ గ్రామానికి చెందిన బిరాదర్ సంతోష్కు, మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకా బింగోళికి చెందిన అర్చన (20)తో గత ఏప్రిల్ 17న వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొద్ది రోజుల నుంచి సంతోష్, అత్తామామలు శాంతబాయి, బాబారావు అదనపు కట్నం కోసం అర్చనను రోజూ వేధించే వారు. దీనిపై ఆమె తన తల్లిదండ్రులకు చెప్పుకొని మధనపడేది. వ్యవసాయ కూలీ పనులు చేసుకొనే తల్లిదండ్రులది అదనపు కట్నం ఇవ్వలేని స్థితి.
ఈ నేపథ్యం లో భర్తతో పాటు అత్తామామలు పెట్టే చిత్రహింసలు భరించలేని అర్చన శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె పుట్టింటి వారికి సమాచారమిచ్చారు. అయితే, సోమవా రం మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారలో చెరువులో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారమందింది. మృతదేహాన్ని వెలికి తీసి, ఆమె అర్చన అని నిర్ధారించారు. చిత్రహింసలు భరించలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
ఠాణా వద్ద ఉద్రిక్తత..
చెరువులో అర్చన మృతదేహం ఉందని తెలియగానే పుట్టింటి వారు, బంధువులు, బింగోళి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మద్నూర్కు తరలివచ్చారు. అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని చంపేశారని ఆమె తల్లిదండ్రులు కీరాబాయి, వామన్రావు, బంధువులు మద్నూర్ పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పెళ్లి సమయంలో రూ.5 లక్షలు, నాలుగు తులాల బంగారం పెట్టామని, ఇంకా కట్నం తేవాలని సంతోష్ తరచూ వేదించే వాడని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డను చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే మృతదేహాన్ని చెరువులో పడేశారని వారు ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలని, అదనపు కట్నం కోసం తమ కూతురి ప్రాణాలు తీసిన సంతోష్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారితో డీఎస్పీ నరసింహరావు మాట్లాడి సర్దిచెప్పారు. హత్య, ఆత్మహత్య అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని సముదాయించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బిచ్కుంద సీఐ సర్దార్సింగ్, ఎస్సై కాశీనాథ్ తెలిపారు.
కాటేసిన కట్న పిశాచి!
Published Tue, Sep 12 2017 12:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement