చిలకలపూడి(మచిలీపట్నం) : భారతదేశంలో జిల్లాకు గుర్తింపు వచ్చేలా పనిచేయాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. కలెక్టరేట్లో మీ కోసం సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెలాఖరు నాటికి జిల్లాకు మంజూరైన 16 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో ఆయా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి 302 గ్రామాలను ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించినట్లు వివరించారు. గ్రామానికి 25 చొప్పున మరుగుదొడ్లు నిర్మిస్తే మరో 300 గ్రామాలు ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జన్మభూమి- మాఊరులో 90,181 అర్జీలు వచ్చాయని చెప్పారు. వీటిలో ముఖ్యంగా గృహనిర్మాణం, రేషన్కార్డులు, ఇళ్లపట్టాలపై అర్జీలు వచ్చాయన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో 75 శాతం నగదు రహిత లావాదేవీలు నిర్వహించగా ఐదువేల మందికి ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. జిల్లాలో సోలార్ పంపుసెట్ల పంపిణీలో దేశంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీన అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు.
అర్జీలు ఇవే..
– పామర్రు మండలం పెరిసేపల్లి గ్రామానికి చెందిన అక్కినేని లక్ష్మి తనకు చెందిన భూమిని బంధువులు స్వాధీనం చేసుకుని దక్కకుండా చేస్తున్నారని, ఇటీవల పండిన పంట కూడా తమదేనంటూ లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, బంధువుల నుంచి తనకు సంబంధించిన పంటను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.
– మచిలీపట్నం పట్టాభి రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్లో రూ. 14 లక్షల విలువైన కాంపోనెంట్స్ యంత్రం గత తొమ్మిది నెలలుగా నిరుపయోగంగా ఉందని ఈ యంత్రం ద్వారా రక్తంలోని ప్లేట్లెట్స్, తెల్లరక్త కణాలు, ఎర్ర రక్త కణాల నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయన్నారు. యంత్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.
జిల్లాకు గుర్తింపు తెచ్చేలా పనిచేద్దాం
Published Mon, Jan 16 2017 10:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement