⇒ రైలు కోసం అధికారుల అగచాట్లు!
⇒ భూసేకరణ ప్రారంభమే కాలేదు
⇒ విదేశీ నిధులు మంజూరు చేయలేదు
⇒ టెండర్లే అసలు ఖరారు కాలేదు
⇒ అయినా ప్రత్యామ్నాయ రోడ్ల కోసం చర్యలు
సాక్షి, విజయవాడ : విజయవాడ నగరంలో మెట్రో రైలును పట్టాలు ఎక్కించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్సీ)ప్రాజెక్టు అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా... అడ్డం కులు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో ఒకేసారి మెట్రో ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే నగర వాసులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై కలెక్టర్ బాబు.ఎ కసరత్తు ప్రారంభించారు. దీని కోసం అవసరమైన పనులను చేపట్టాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వాస్తవంగా పరిశీలిస్తే అధికారులు చేస్తున్న హడావుడికి, ప్రాజెక్టు ముందుకు సాగుతున్న తీరుకు ఏ మాత్రం పొంతన కనపడటం లేదు. ప్రాజెక్టు అమలుకు కావాల్సిన అడ్డంకులను తొలగించుకోకుండా అధికారులు హడావుడి చేయడం సరికాదని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ సంస్థలు నిధుల కోసం ఎదురు చూపులు
ఏఎంఆర్సీ ప్రాజెక్టు ఎంతమేరకు లాభదాయకమనే అంశంపై జర్మనీ, ప్రాన్స్ సంస్థలకు అంచనాలు వేస్తున్నాయి. ఇటీవల అధికారులు వచ్చి రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినా నిధులు విడుదలలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో నిధులు రావడంలో జాప్యం జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా పరిపాలన పరమైన అనుమతులు రాలేదు. కేంద్రం తన వాటా నిధులను విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు పూర్తిగా విడుదల కాలేదు. ఈ నేథ్యంలో మెట్రో ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల కోసం అధికారులు ఇంకా వెతుకులాట దశలోనే ఉన్నారు. ఇక ప్రాజెక్టు పనులు చేపట్టడానికి కావాల్సిన టెండర్లు ఖరారు చేయలేదు. ఇప్పటి వరకు కేవలం టెక్నికల్ బిడ్లను మాత్రమే తెరిచారు. ఇంకా ఫైనాన్సియల్ బిడ్ తెరిచి అర్హులైన వారికి టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది.
ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు
కీలకమైన దశలు దాటకుండానే జిల్లా అధికారులు, ఏఎంఆర్సీ అధికారులు ప్రాజెక్టు ప్రారంభమైతే ప్రజలు ఇబ్బంది పడకుండా ఏఏ చర్యలు తీసుకోవాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల మీదగా వచ్చే వాహనాలు నగరంలోకి రాకుండా చూసేందుకు ప్రత్నామాయం ఆలోచిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్, చెన్నై వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో అంతర్గత రోడ్లపైన దృష్టి పెట్టారు. వీటి కోసం ప్రస్తుతం ఉన్న వంతెనలు, కల్వర్టులకు మరమ్మతులు చేయడం, కొత్త రోడ్ల నిర్మాణం, అవసరమైన చోట కొత్త సబ్వేలు నిర్మించడం వంటి పనులు చేస్తున్నారు. దీని కోసం అన్ని శాఖల అధికారులతోనూ రెవెన్యూ, ఏఎంఆర్సీ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
భూసేకరణపై ప్రజల అభ్యంతరాలు
ఏలూరు రోడ్డులో భూములు కోల్పోతున్న వారు మెట్రో రైలు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా నష్టమని, ఇందులో పెట్టుబడులు పెడితే తిరిగి రావడం అసాధ్యమని కొంతమంది బాధితులు మెట్రో ప్రాజెక్టుకు రుణాలు ఇవ్వనున్న జర్మనీ, ఫ్రాన్స్కు చెందిన రుణ సంస్థలకు లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు డిజైన్లు మార్చాలంటూ నిబంధనలు పెట్టాలని రుణ సంస్థలకు సూచిం చారు. బీఆర్టీఎస్ రోడ్డు, కాలువలపైన మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని సూచిం చారు. ఇదే ప్రతిపాదనలపై జర్మనీ, ఫ్రాన్స్ సంస్థలు ఏఎంఆర్సీ వివరణ కోరాయి. డిజైన్లు మార్చడంలో గల ఇబ్బందులను ఏఎంఆర్సీ అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాధితుల నుంచి వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భూ సేకరణకు రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకూ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
లూప్లైన్లోనే మెట్రో
Published Mon, Mar 13 2017 11:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement