జాతీయ సదస్సుకు మేయర్‌ పాపాలాల్‌ | Sakshi
Sakshi News home page

జాతీయ సదస్సుకు మేయర్‌ పాపాలాల్‌

Published Thu, Sep 29 2016 10:28 PM

మేయర్‌ పాపాలాల్‌

ఖమ్మం వైరారోడ్‌ : కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఇండో-సాన్‌ 2016 (స్వచ్ఛభారత్‌) జాతీయస్థాయి సదస్సులో పాల్గొనేందుకు ఖమ్మం మేయర్‌ పాపాలాల్‌ గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సదస్సులో రాష్ట్రస్థాయిలో ఎంపికైన 12 పట్టణాల్లో (అమృత్‌ పథకం కింద) కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలుకు సంబంధించి నగదు ప్రోత్సాహకాను అందజేస్తారు. అలాగే జాతీయస్థాయిలో స్వచ్ఛభారత్‌ కింద చేపట్టే వివిధ కార్యక్రమాలు, రానున్న రోజుల్లో అనుసరించే విధివిధానాలపై ఉన్నతస్థాయి చర్చ జరుగుతుందని మేయర్‌ పాపాలాల్‌ తెలిపారు.

 

Advertisement
Advertisement