మల్లాపూర్: మైనర్బాలిక పెళ్లిచేసేందుకు యత్నించిన తల్లిదండ్రులకు తహశీల్దార్ రవీందర్రాజు, ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏఎస్సై అహ్మదుల్లాఖాన్ మంగళవారం ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎఎస్సై అహ్మదుల్లాఖాన్లతో కౌన్సెలింగ్ నిర్వహించారు. 18 ఏళ్లు నిండని బాలికకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని వారు సూచించారు.మండలంలోని సిరిపూర్ గ్రామానికి చెందిన గుగ్లావత్ రాంనాయక్–లక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె శశిరేఖ(16)కు అదే గ్రామానికి చెందిన భూక్య సురేష్తో ఈనెల 10న వివాహం నిశ్చయించారు. శశిరేఖ మెట్పల్లిలో ఇంటర్ చదువుతోంది. మైనర్బాలికకు వివాహం చేస్తున్నారని ఒడ్డెలింగాపూర్కు చెందిన బాలిక మేనత్త భూక్య జమున తహశీల్దార్ కార్యాలయం, స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులను మంగళవారం తహశీల్దార్ కార్యాలయంకు పిలిపించి తహశీల్దార్, ఎంపీడీవో, ఏఎస్సైలు కౌన్సిలింగ్ నిర్వహించారు. శశిరేఖకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. అధికారులు, కులపెద్దలు, గిరిజన సంఘం నాయకుల కౌన్సెలింగ్లో రాంనాయక్–లక్ష్మీ దంపతులు తమ కుమార్తె వివాహ నిర్ణయాన్ని మార్చుకున్నారు. శశిరేఖకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం జరిపిస్తామని అధికారులకు అంగీకార పత్రాన్ని రాసి ఇచ్చారు.
బాలిక వివాహం నిలిపివేత
Published Tue, Aug 9 2016 6:48 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
- బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
Advertisement