'సొంత నియోజకవర్గంలో మంత్రి అక్రమాలు' | Sakshi
Sakshi News home page

'సొంత నియోజకవర్గంలో మంత్రి అక్రమాలు'

Published Tue, Aug 4 2015 5:09 PM

'సొంత నియోజకవర్గంలో మంత్రి అక్రమాలు' - Sakshi

తిరుపతి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రాక్షసపాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, నారాయణ స్వామి, నియోజకవర్గం ఇన్ఛార్జీ బియ్యపు మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే అక్రమాలకు పాల్పడుతున్నారని వీరు ఆరోపించారు.

వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడతున్నారని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ నేతలకు తగిన శాస్తి తప్పదని శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తల బరోసయాత్రలో పాల్గొన్న పార్టీ నేతలు అధికార పార్టీ నేతలకు సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement