‘కృష్ణా’ వాదనల్లో అవకాశమివ్వండి | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’ వాదనల్లో అవకాశమివ్వండి

Published Tue, Oct 27 2015 5:17 AM

‘కృష్ణా’ వాదనల్లో అవకాశమివ్వండి

ఉమాభారతి అపాయింట్‌మెంట్ కోరిన మంత్రి హరీశ్‌రావు

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ వివాద పరిష్కారానికి ఏర్పాటైన బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు కొత్తగా ఏర్పడిన తెలంగాణ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలని రాష్ట్రం భావి స్తోంది. కృష్ణా జాలలను పునఃపంపిణీ చేయాలని, వాదనల్లో నాలుగు రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకున్నాకే కేటాయింపులపై తుది నిర్ణయానికి రావాలని కోరేందుకు సిద్ధమైంది.

దీంతోపాటు రాష్ట్రం తేనున్న నూతన జల విధానంపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, సోమవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. అపాయింట్‌మెంట్ ఖరారైతే హరీశ్ మంగళవారం లేదా బుధవారం ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటే మిషన్ కాకతీయ రెండో దశ పనుల ఆరంభానికి ఉమాభారతిని ఆహ్వానించనున్నారు.

Advertisement
Advertisement