కాంగ్రెస్పై మంత్రి హరీశ్ ధ్వజం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘అవును చాలా సంతోషంగా ఉంది. చెరువుల మంత్రిగా నా ధ్యాస ఎప్పుడూ చెరువుల మీదనే ఉంటుంది. పొంగుతున్న ఆ వాగులు, ఈ ఘణపురం ఆనకట్ట పరవళ్లను చూస్తుంటే.. తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషం అరుుందో ఇప్పుడూ అంతే ఉంది. వరదను చూసి మా రైతన్నల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది, కానీ కాంగ్రెస్ వాళ్లకే దుఃఖం వస్తోంది. ఇంత బాగా వర్షాలు కురిస్తే కేసీఆర్కు మంచి పేరు వస్తోందని, పోరుున వానలు అటే పోక ఎందుకు కురుస్తున్నయ్ అని వాళ్లు బాధపడిపోతున్నరు’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
శనివారం ఘణపురం ఆనకట్ట మీద నిలబడి మంజీర నది ఉధృతిని పరిశీలిస్తూ ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘‘భారీ వర్షాల కారణంగా సహజంగా వచ్చే జలాల కంటే 1.10 లక్షల క్యూసెక్కుల నీరు వరద రూపంలో అదనంగా వచ్చింది. దీనికి 60 వేల క్యూసెక్కుల జలాలను జత కలిపి 1.70 వేల క్యూసెక్కుల నీళ్లను నిజాంసాగర్ వైపు మళ్లించాం. సిం గూరు సామర్థ్యం 29.99 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.8 టీఎంసీల నీళ్లున్నారుు. ఆదిలాబాద్ జిల్లా కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టు 2.69 లక్షల క్యూసెక్కుల నీరు చేరుకుంది. శ్రీరాంసాగర్లో 68 టీఎంసీల నీళ్లు చేరారుు. పక్క రాష్ట్రం నుంచి భారీగా వరద చేరుతోంది. ఎగువ మా నేరు, దిగువ మానేరు పూర్తిగా నిండినవి. మూ సినదిలోకి 35 వేల క్యూసెక్కుల నీళ్లు చేరారుు. చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నారుు.
మిషన్ కాకతీయ ఫలాలు
మిషన్ కాకతీయ ఫలాలు అందుతున్నారుు. మెదక్ జిల్లాలో 7,700 చెరువులు ఉంటే 5,200 చెరువులు నిండాయని, మిగిలిన చెరువల్లో 75 శాతం వరకు నీళ్లు చేరారుు. రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి ఉంది. ఈ జలాలు రబీ అవసరాలకు, వచ్చే ఏడాది ఖరీఫ్కు కూడా సరిపోతారుు. మల్లన్న సాగర్ను పూర్తి చేసి రైతన్నల కళ్లలోని ఆ ఆనందం శాశ్వతంగా ఉండేలా సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డం పడుతోంది. ఎన్ని అడ్డంకులు సృష్టిం చినా కచ్చితంగా మల్లన్న సాగర్ను పూర్తి చేస్తాం.
భారీ వర్షాల కారణంగా చిన్న ప్రాణిని కూడా పోగొట్టుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దురదృష్టవశాత్తు చనిపోరుున వారి కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం. వరదల్లో పంటలు మునిగిపోరుున రైతులకు అండగా ఉంటాం. చెరువులు తెగిన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడానికి రెవెన్యూ, పోలీసు, ఇతర అధికారులను సిద్ధంగా ఉంచాం. నీట మునిగిన లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించి, పునారావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరిస్థితి సద్దుమణిగే వరకు ఈ పునరావాస కేంద్రాలను కొనసాగిస్తాం’’ అంటూ మంత్రి హరీశ్రావు తెలిపారు.
చెరువులు నిండినా ఏడుపేనా?!
Published Sun, Sep 25 2016 3:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement