- నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు పిలుపు
- కాంగ్రెస్, టీడీపీలే అడ్డుకుంటున్నాయని ఆరోపణ
- మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి తీరుతాం
సాక్షి, మెదక్: సాగునీటి ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు ఎవరైనా వస్తే వారిని కాల్వల్లో పాతర వేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు రైతులకు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ పట్ట ణం, నిజాంపేట, వెంకటాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రామాయంపేట మండలం నిజాంపే టలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలపై తీవ్ర స్థారుులో ధ్వజమెత్తారు. రైతులకు మేలు చేసేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్నసాగర్, కాళేశ్వ రం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ నుంచి మెదక్ జిల్లాకు సాగునీరు తీసుకువచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. మూడవ విడత మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువుల పనులు చేపట్టను న్నట్లు చెప్పారు.
అలాగే చెరువుల కట్టకా ల్వలను ఆధునీకరిస్తామని వివరించారు. రైతులు కరెంటోళ్లకు ఒక్క రూపారుు కూడా లంచం ఇవ్వద్దని కోరారు. సీఎం కేసీఆర్ కరెంటు కోసం రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు 9గంటల నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. ట్రాన్సఫార్మర్లను రైతులు కోరిన చోట ఉచితంగా బిగించనున్నట్లు చెప్పారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో గొర్రెల కాపర్ల కోసం ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గొర్రెల కాపర్లు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఏడాది గొర్రెల కాపర్ల సంక్షేమం కోసం రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు.
ప్రాజెక్టులను అడ్డుకుంటే పాతరేయండి
Published Wed, Nov 23 2016 3:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement