వివాదస్పద వ్యాఖ్యలతో దుమారం | Sakshi
Sakshi News home page

వివాదస్పద వ్యాఖ్యలతో దుమారం

Published Mon, Mar 27 2017 12:15 AM

minister kamineni srinivas comments hilights

ఎస్కేయూ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఎస్కేయూ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివాదస్పద వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల రెడ్డి వామపక్ష విద్యార్థి సంఘాలు అస్థిత్వం కోల్పోతున్నాయని వ్యాఖ్యానించడం  తీవ్ర చర్చకు దారి తీసింది. అక్కడే ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. నేరుగా విద్యార్థి సంఘాల ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు గెలుపొందాయని గట్టిగా నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఇటుకలపల్లి సీఐ రాజేంద్ర నాథ్‌ యాదవ్‌ కలుగచేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకవచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement