అమ్మాయిల హాస్టల్‌లో రావెల అనుచరులు | Sakshi
Sakshi News home page

అమ్మాయిల హాస్టల్‌లో రావెల అనుచరులు

Published Fri, Oct 28 2016 10:46 AM

మంత్రి అనుచరులు బస చేసేందుకు అధికారులు సమకూర్చిన పరుపులు, దుప్పట్లు - Sakshi

గుంటూరు : మంత్రి రావెల కిశోర్ బాబు వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ‘సంక్షేమాన్ని’ విస్మరించిన మంత్రి తన అనుచరులకు ఏకంగా అమ్మాయిల హాస్టల్లోనే వసతి కల్పించారు. అధికార దర్పంతో విద్యార్థినుల భద్రతను విస్మరించిన ఈ ఘటన గుంటూరులో బుధవారం  చోటు చేసుకుంది. స్థానిక పోలీసు పెరేడ్‌ గ్రౌండ్‌లో నిన్న ప్రభుత్వ దళిత, గిరిజనబాట, మెగా రుణమేళాను ఎస్సీ కార్పొరేషన్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం మంత్రి రావెల అనుచరులు వందమందికి పైగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి గుంటూరు వచ్చారు.

వారందరికీ కలెక్టరేట్‌ రోడ్డులోని పరివర్తన భవన్‌లో ఆశ్రయం కల్పించారు. ఆ భవన్‌లోనే సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలికల పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌ నడుస్తోంది. బాలికలు ఉండే చోట మగవారికి ఆశ్రయం కల్పించకూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ తన అనుచరుల కోసం మంత్రి వాటికి తిలోదకాలిచ్చారు. కొంతమంది అధికారులు వారించినా మంత్రి పెడచెవిన పెట్టినట్లు తెలిసింది.

Advertisement
Advertisement