కోర్టుకు హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే

Published Sat, Oct 8 2016 5:28 AM

mla, mp attend court in adilabad

ఆదిలాబాద్‌ క్రైం :
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఆదిలాబాద్‌ ఎంపీ గొడాం నగేశ్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్‌లపై అప్పట్లో ఇంద్రవెల్లిలో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి శుక్రవారం ఎంపీ, ఎమ్మెల్యేలు ఆదిలాబాద్‌ ప్రథమ శ్రేణి న్యాయస్థానానికి హాజరయ్యారు. విచారణ అనంతరం కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

Advertisement
Advertisement