♦ త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను
♦ మీడియాతో ఎమ్మెల్యే రోజా
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు సూచనల మేరకు సభాపతికి లేఖ రాశానని, దాన్ని పరిగణనలోకి తీసుకుని త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పేర్కొన్నారు. శుక్రవారం సుప్రీం కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘విచారం వ్యక్తం చేస్తే అభియోగాలు ఉపసంహరించుకుంటామని ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టులో చెప్పారు. రాష్ట్ర సంక్షేమం కోసం కలసి పనిచేయాలని ధర్మాసనం సూచించింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం, నా నియోజకవర్గ ప్రజల కోసం నేను ఈ లేఖ ఇచ్చాను. ఎవరినీ బాధపెట్టాలని గానీ, అగౌరవపరచాలని గానీ అసెంబ్లీలో మాట్లాడలేదు. ఒకవేళ సభ్యులను గానీ, సీఎంను గానీ బాధ పెట్టి ఉంటే ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు లేఖలో రాశాం. దీనిపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవాలి. ఈ నెల హైకోర్టులో కేసు విచారణ ఉంది. మా వాదనలు వినిపిస్తాం. నిజంగానే వాళ్లు దీన్ని క్లియర్ చేయాలనుకుంటే ఆగస్టు దాకా ఎదురుచూడరు. ముందే నిర్ణయం తీసుకుంటే ప్రజలను, ఎమ్మెల్యేలను గౌరవించుకున్నట్టు అవుతుందని ఆశిస్తున్నా..’ అని పేర్కొన్నారు. ఒకవేళ మీకు అనుకూలంగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఏంచేస్తారన్న ప్రశ్నకు.. ‘రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించే వారైతే ఈ నెల లేదా వచ్చే నెల్లో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇప్పటికే నా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా’ అన్నారు.
సోమవారం హైకోర్టులో మెన్షన్ చేస్తాం: ఇందిరా జైసింగ్
సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఎమ్మెల్యే రోజా, మరో న్యాయవాది నర్మదా సంపత్తో కలిసి ఏపీభవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘రోజా వివరణను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. స్పీకర్ ఆ లేఖను సభ ముందుంచి నిర్ణయం తీసుకుంటారు. రోజా అసెంబ్లీ ఆవరణలోని పార్టీ కార్యాలయానికి వెళ్లే అవకాశాన్ని సుప్రీం కోర్టు కల్పించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రభావానికి లోను కావొద్దని సింగిల్ జడ్జికి సూచించింది. మా ప్రధాన పిటిషన్ను త్వరగా విచారించాలని సింగిల్ జడ్జి బెంచ్ వద్ద సోమవారం మెన్షన్ చేస్తాం. సుప్రీం కోర్టులో మా పిటిషన్ను ఉపసంహరించుకోలేదు. సభ, స్పీకర్ అన్యాయంగా వ్యవహరిస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని రాజ్యాంగ ధర్మాసనం అనేక తీర్పుల్లో చెప్పింది’ అని పేర్కొన్నారు.
సభాపతికి లేఖ రాశాను
Published Sat, Apr 23 2016 2:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement