విలేకరికి ఎమ్మెల్సీ అన్నం సతీశ్ హెచ్చరిక
సాక్షి, గుంటూరు/పాతగుంటూరు: అక్రమాలను ప్రశ్నిస్తే చాలు అధికారపార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అడిగేవాడు ఉండడనే ధీమాతో దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ ఓ విలేకరిని తీవ్ర స్థాయితో బెదిరించారు. తాను పెద్దల సభలో సభ్యుడిని అన్న విషయం కూడా మర్చిపోయి.. పత్రికల్లో రాయలేని భాషలో ఆ విలేకరిపై విరుచుకుపడ్డారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ నిర్మాణంలో అక్రమాలపై ఆ విలేకరి సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఎమ్మెల్సీ ఆగ్రహానికి కారణం. వివరాలు ఇలా ఉన్నాయి..
రూ. 70 లక్షలకు టెండర్లు.. రూ. 1.30 కోట్లు ఖర్చు
బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి రూ. 70 లక్షలతో టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. తరువాత నిర్మాణ వ్యయాన్ని రూ. 1.30 కోట్లుగా ఖర్చు చూపారు. దీనిపై కౌన్సిల్లో తీవ్ర స్థాయిలో రగడ జరిగింది. నిర్మాణం చేసిన 17 షాపులకు రూ. 36 లక్షలతో మళ్లీ టెండర్లను పిలవడం టీడీపీ నేతల అధికార దుర్వినియోగానికి, అవినీతికి నిదర్శనమంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
స.హ.చట్టం ద్వారా దరఖాస్తు..
ఈ నేపథ్యంలోనే బాపట్లకు చెందిన 6 టీవీ రిపోర్టర్ చల్లా శ్రీనివాసరావు మార్కెట్ నిర్మాణాలు, అందులో జరిగిన అవకతవకలపై వివరాలు కోరుతూ బాపట్ల మున్సిపల్ కమిషనర్కు స.హ. చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. గడువు ముగిసినా సమాచారం ఇవ్వకపోవడంతో మరోసారి అప్పీలు చేశారు. ఈ వ్యవహారం ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ దృష్టికి వెళ్లడంతో ఆయన శ్రీనివాసరావుకు ఫోన్ చేశారు. సమాచారం ఎందుకు అడిగావంటూ ప్రశ్నించారు. ‘ఏం తమాషాగా ఉందా.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా’ అంటూ బెదిరింపులకు దిగారు. అనంతరం బూతు పురాణం అందుకున్నారు. ఎమ్మెల్సీ బెదిరింపుల ఆడియోను శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పెట్టారు.
ఎమ్మెల్సీ వల్ల ప్రాణహాని
ఎమ్మెల్సీ అన్నం సతీ్శ ప్రభాకర్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని విలేకరి చల్లా శ్రీనివాసరావు భయాందోళన వ్యక్తం చేశారు. గుం టూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు ప్రాణభయం ఉండటంతో కలెక్టర్, అర్బన్, రూరల్ ఎస్పీ, సీఎం, గవర్నర్లకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.
విలేకరిపై కేసు నమోదు
బాపట్ల: విలేకరి చల్లా శ్రీనివాసరావుపై బాపట్ల పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. బాపట్ల మున్సిపల్ డీఈ సీతారామారావు, ఏఈ హసీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. విలేకరి తమను సమాచారం ఇవ్వాలని కోరడంతో పాటు పేపర్, టీవీకి యాడ్స్ రూపంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొనడంతో శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.
వేషాలేస్తే తాటతీస్తా...
Published Mon, Oct 24 2016 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement