ముగిసిన మొహర్రం సంతాప దినాలు | Sakshi
Sakshi News home page

ముగిసిన మొహర్రం సంతాప దినాలు

Published Mon, Nov 21 2016 9:37 PM

ముగిసిన మొహర్రం సంతాప దినాలు

బనగానపల్లె రూరల్‌: బనగానపల్లె పట్టణంలో మొహర్రం సంతాప దినాలు సోమవారం ముగిశాయి. గత నెల 12వ తేదీన పీర్ల నిమజ్జనంతో ఇవి ప్రారంభమయ్యాయి. ముగింపు సందర్భంగా కొండపేటలోని తల్లిపీర్ల చావిడి వద్ద నుంచి ఇమాం హసన్, ఇమాం హుస్సేన్‌ పీర్లకు షీయా మతస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం చురకత్తులు, బ్లేడ్లతో వీపు, ఎదలపై మాతం చేస్తూ ర్యాలీగా  విద్యుత్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అలాగే పట్టణంలోని ఆస్థానం నుంచి బనగానపల్లె నవాబు మీర్‌ఫజిల్‌ అలీఖాన్, ఆయన కుమారుడు గులాం అలీఖాన్‌ ఆధ్వర్యంలో దొరకోట వరకు షీయా మతస్తులు మాతం నిర్వహించారు. మాతం చూసేందుకు హిందూ ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  ఎంఐఎం ఆధ్వర్యంలో వారకి మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement