విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత
బంద్తో మండలంలో స్తంభించిన జనజీవనం
మొయినాబాద్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్తో అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన మండలం బంద్ విజయవంతమైంది. ఉదయం 7 గంటల నుంచే గ్రామాల్లో అఖిలపక్షం నాయకులు, యువకులు, విద్యార్థులు రోడ్లుపైకి వచ్చి వాహనాలను నిలిపివేశారు. దుకాణదారులు, వ్యాపారులు స్వచ్ఛందంగా తమ షాపులు మూసివేసి బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మండలంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, పాఠశాలలకు బంద్కు సంబంధించి ముందే సమాచారం ఇవ్వడంతో సెలవును ప్రకటించాయి. ప్రభుత్వ కార్యాలయాలను అఖిలపక్షం నాయకులు సోమవారం మూసివేయించారు. మండల కేంద్రంలో సుమారు ఏడు గంటలపాటు మహాధర్నా చేపట్టారు. కళాకారులచే ధూం.. ధాం కార్యక్రమం నిర్వహించి మండల పరిస్థితిపై పాటలు, కళారూపాలు ప్రదర్శించారు.
ఇదిలా ఉండగా.. బంద్ సందర్భంగా సోమవారం మండలంలో జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచే ఆందోళనకారులు గ్రామాల నుంచి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో నగరానికి వెళ్లే ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులకోసం వెళ్లేవారు ఇబ్బంది బడ్డారు. బంద్ ప్రభావం సోమవారం మండల కేంద్రంలో సాగే సంత(అంగడి)పై పడింది. అదేవిధంగా మండలంలోని వెంకటాపూర్లో ప్రభుత్వ పాఠశాలను బంద్ చేయించడానికి వెళ్లిన అఖిలపక్షం నాయకులు విద్యార్థులందరినీ పాఠశాల బయటకు రప్పించి మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. మండల పరిధిలోని రెడ్డిపల్లిలో హిమాయత్నగర్ - తంగడ్పల్లి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. శ్రీరాంనగర్, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన యువకులు బైక్ ర్యాలీతో మొయినాబాద్కు చేరుకున్నారు. పెద్దమంగళారానికి చెందిన మహిళలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాధర్నా తరలి వచ్చారు. ధర్నా వద్దే వంటావార్పు చేసి భోజనాలు చేశారు.
మొయినాబాద్ బంద్ విజయవంతం
Published Mon, Aug 29 2016 11:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement