– కొట్టి.. పురుగులమందు తాపి..
– అతిగా మద్యం సేవించొద్దన్నందుకే కుమారుల ఘాతుకం
– నార్కట్పల్లి మండలంలో దారుణం
– పోలీసుల అదుపులో నిందితులు..?
నవమాసాలు మోసి.. పురిటినొప్పులను పంటి బిగువన అదిమి జన్మనిచ్చిందనే విషయాన్నే మరచిపోయారు.. లాలిపాటలు.. గోరుముద్దలు గుర్తుకే రాలేదు.. విద్యాబుద్ధులు చెప్పించి పెంచి పెద్దచేసిందనే కనికరం కూడా చూపలేదు.. అతిగా మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచించిన ఆ మాతృమూర్తిని పొట్టనబెట్టుకున్నారు.. ఇద్దరు కిరాతక కుమారులు. ఈ దారుణ ఘటన గురువారం నార్కట్పల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
– నార్కట్పల్లి
నార్కట్పల్లి మండలం నక్కలపల్లి గ్రామపంచాయతీ పరిధి గద్దగోటిబావి గ్రామానికి చెందిన బోగిని సైదులు, పిచ్చమ్మ(48) దంపతులకు వెంకన్న,నరేష్ కుమారులు. తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ, కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. గురువారం గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న చిన్నకర్మకు తల్లితో పాటు ఇద్దరు కుమారులు వెళ్లారు.
ఆరోగ్యాన్ని పాడు చేసుకోద్దనందుకు..
బంధువుల ఇంట్లో కార్యక్రమం జరుగుతుండగానే కుమారులిద్దరు పక్కనే మద్యం సేవిస్తున్నారని పిచ్చమ్మకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి అతిగా తాగి ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని పెద్ద కుమారుడు వెంకన్నకు సూచించింది. దీంతో వెంకన్న ఆగ్రహావేశానికి లోనై తల్లిని అక్కడే కొడుతుండగా చిన్న కుమారుడు నరేష్ కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి పరువు తీస్తావా అంటూ ఆ మాతృమూర్తిని కొట్టుకుంటూ ఇంటికి తీసుకువచ్చారు.
బలవంతంగా పురుగుల మందు తాపి..
కుమారులు కొడుతుండడంతో లబోదిబోమంటూ పిచ్చమ్మ ఇంట్లో నుంచి బయటికి పరుగుతీయడంతో ఆమెను ఈడ్చుకుంటూ మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ ఘటనను చూసిన వారి ఇద్దరి భార్యలు అడ్డురావడంతో వారిని కూడా చితకబాదారు. ఆపై వ్యవసాయ సాగు కోసం తెచ్చిన పురుగులమందును పిచ్చమ్మకు బలవంతంగా తాపించి గదిలో పడవేసి గడియపెట్టి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిపోయారు. కాసేపటికి ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడడంతో అప్పటికే పిచ్చమ్మ మృతిచెందింది. గ్రామస్తుల సమాచారం మేరకు సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎస్ఐ మోతీరామ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కాగా, వ్యవసాయ బావి వద్ద ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.
కిరాతకులు అమ్మను చంపేశారు..!
Published Thu, Jul 28 2016 10:21 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement