వచ్చిన నీటిని వదిలేస్తే రాయలసీమకు ఎలా? | Sakshi
Sakshi News home page

వచ్చిన నీటిని వదిలేస్తే రాయలసీమకు ఎలా?

Published Tue, Sep 22 2015 7:17 PM

mp avinash reddy questioned ap governement on srisailam water

కడప: పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇస్తామనే ధైర్యం లేకనే శ్రీశైలం నీటిని కిందికి వదులుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లు కిందికి వదిలేస్తే రాయలసీమ పరిస్థితి ఏమికావాలని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రాజెక్టు వద్ద కిందికి వదులుతున్న నీటిని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement