- అనుమానాస్పద స్థితిలో తోడికోడళ్లు మృతి
- పోలీసుల అదుపులో అత్త, మామ, భర్త
- మృతదేహాలను పరిశీలించిన డీఎస్పీ, సీఐ, ఎస్ఐ
రాజంపేట: వారిద్దరూ తోడికోడళ్లు..కలిసిమెలిసి జీవించాల్సిన వీరు ఒకేసారి మృత్యు ఒడిలోకి వెళ్లారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్యకు గురయ్యారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ సంఘటన రాజంపేట మండలం సిద్ధులపల్లె కొత్తరాచపల్లెలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మల్లికార్జునరాజు, భాగ్యమ్మ దంపతులకు మల్లయ్య, వెంకటేశ్వరరాజు కుమారులు ఉన్నారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. తాళ్లపాకకు చెందిన దివ్య (18)తో వెంకటేశ్వరరాజుకు, సిద్ధులపల్లెకు చెందిన జ్యోత్స్న(18)తో మల్లయ్యకు వివాహమైంది. జ్యోత్స్నకు యేడాది పాప కూడా ఉంది. దివ్య భర్త వెంకటేశ్వరరాజు జీవనోపాధి నిమిత్తం కువైట్కు వెళ్లాడు. వీరంతా ఉమ్మడి కుటుంబంలో జీవనం కొనసాగిస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో తోడికోడళ్లు మృతి
జ్యోత్స్న, దివ్యల మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు భావిస్తున్నారు. గురువారం ఉదయాన్నే అత్త,మామ ఇంటికి తాళాలు వేసుకొని వెళ్లినట్లుగా చెబుతున్నారు. సాయంత్రం వరకు వేసిన తాళాలు తెరవకపోవడంతో ఇంటిలో ఉన్న కోడళ్లు ఏమయ్యారనే అనుమానాలు గ్రామస్తుల్లో పుట్టుకొచ్చాయి. ఉదయం వెళ్లిన అత్త,మామ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. వీరితో పాటు జ్యోత్స్న భర్త మల్లయ్య కూడా చేరుకున్నాడు. వారు అక్కడికి రాగానే గ్రామస్తులు వెళ్లి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాన్ని తోడికోడళ్ల అత్తమామలు అడ్డుకున్నారు. అయినప్పటికీ గ్రామస్తులు తలుపులు తీసి చూడగా తోడికోడళ్లు విగత జీవులుగా పడి ఉన్నారు. వారు ఎప్పుడు చనిపోయారు? ఆత్మహత్య చేసుకుంటే అప్పుడే తెలిసేది కదా? ఒక వేళ అత్తమామ, భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రంగంలోకి దిగిన పోలీసులు
తోడికోడళ్లు మృతి చెందిన సమాచారం తెలుసుకున్న రాజంపేట డీఎస్పీ రాజేంద్ర, సీఐ హేమసుందరావు, ఎస్ఐ నాగరాజులు తమ సిబ్బందితో కొత్తరాచపల్లె గ్రామానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు అత్త, మామ,భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ నాగరాజుతెలిపారు.
హత్యా..! ఆత్మహత్యా..!
Published Thu, Nov 17 2016 10:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement