– నడిగూడెం కోటలో పింగళి రూపకల్పన
నడిగూడెం: జాతీయ త్రివర్ణ పతాకాన్ని నడిగూడెంలోని జమీందారు రాజా బహుద్దూరు నాయిని వెంకటరంగారావు కోటలోనే పింగళి వెంకయ్య రూపొందించారు. పింగళి వెంకయ్య స్వగ్రామం మచిలీపట్నం వద్ద ఓ కుగ్రామం. 1910లో అమెరికాలోని
బావిస్టన్లో పింగళి వెంకయ్య, రాజా నాయిని వెంకటరంగారావు కలిసి చదువుకున్నారు. పింగళి వెంకయ్య వ్యవసాయం, వెంకటరంగారావు ఎల్ఎల్బీలో అక్కడే పట్టభద్రులయ్యారు. నాడు రాజా నాయిని వెంకటరంగారావు అప్పటి క్రిష్ణా జిల్లా నందిగామ తాలూకా మునగాల పరగణాను పాలిస్తున్నారు. పింగళి వెంకయ్యకు వ్యవసాయంలో ప్రావీణ్యం ఉండడంతో ఈ పరగణాలో పత్తి సాగు కోసం, ఆ పంట విస్తరణ కోసం రాజావారు పింగళి వెంకయ్యను తన ఆస్థానంలో వ్యవసాయాధికారిగా నియమించుకున్నారు. 1910లో స్వాతంత్ర పోరాట ఉద్యమం ఉదృతంగా జరుతున్నది. జాతిపిత మహాత్మా గాంధీ అంటే పింగళి వెంకయ్య బాగా ఇష్టం. పింగళి వెంకయ్య రాజావారి వద్ద విధులు నిర్వహిస్తూనే నాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేవాడు. నాడు అనేకసార్లు గాంధీజీని కలిసేవారు. పలుసార్లు గాంధీ మన జాతికి జాతీయ జెండా కావాలని అడగడంతో 1926లో పింగళి వెంకయ్య మూడు రంగుల్లో ఒక జాతీయ జెండాను రూపొందించారు. కశాయం రంగు ఉద్యమ స్పూర్తి కోసమని, తెలుపు శాంతి కోసమని, ఆకుపచ్చని రంగు దేశం నిత్యం పచ్చని పైరులతో ఉండాలనేది దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. ఈ మూడు రంగులో మధ్యలో గాంధీజీ నూలు వడికంచు రాట్నం పటంతో ఈ జాతీయ జెండాను రూపొందించారు. 1926లోనే తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని గాంధీజికి ప్రదర్శించారు. అప్పటికే దేశ నలుమూలల నుంచి 16 నమూనాలు గాంధీజీకి అందాయి. పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో 1930లో రాట్నంను తొలగించి ఆశోక చక్రంతో రూపొందించి పింగళి వెంకయ్య రూపొందించిన జెండానే గాంధీజీ ఖరారు చేశారు. తర్వాత ఈ స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ఈ జాతీయ జెండాను పట్టుకొని ఉద్యమకారులు ఉద్యమాన్ని నిర్వహించారు. నాడు నడిగూడెంలోనే పింగళి వెంకయ్య దేశం గర్వించపడేలా జాతీయ జెండాను రూపొందించడం పట్ల నడిగూడెం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్రివర్ణ జెండా రూపకల్పన ఇక్కడే
Published Mon, Aug 15 2016 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement