వెలుగోడులో జాతీయ సదస్సు | Sakshi
Sakshi News home page

వెలుగోడులో జాతీయ సదస్సు

Published Fri, Jan 20 2017 12:36 AM

National Convention at Velugodu

-  ఈ నెల 28, 29 తేదీల్లో కార్యక్రమం
- శ్రీనీలం సంజీవరెడ్డి డిగ్రీ కాలేజీ ఆవరణలో ఏర్పాట్లు 
 
వెలుగోడు(శ్రీశైలం): ఈ నెల 28, 29 తేదీల్లో వెలుగోడు శ్రీ నీలం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన జాతీయ విద్యా సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడ్వాన్స్‌డ్‌ ఇన్‌ గ్రీన్‌ కెమిస్ట్రీ అనే అంశంపై తలపెట్టిన జాతీయ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు హాజరవుతుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు చైర్మన్‌గా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.రాంభూపాల్‌రెడ్డి, కో-చైర్మన్‌గా బి.రాబేశ్వర్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా కెమిస్ట్రీ అధ్యాపకులు టీఎస్‌.రాజేంద్రకుమార్‌ ఎంపికయ్యారు. వీరు గురువారం సదస్సు ఏర్పాట్లను సమీక్షించారు. సదస్సులో పాల్గొనే వారు ఫోన్‌(9490974069)లో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.  
 

Advertisement
Advertisement