ఢిల్లీ స్థాయిలో ‘అనంత’కు పేరు | Sakshi
Sakshi News home page

ఢిల్లీ స్థాయిలో ‘అనంత’కు పేరు

Published Sun, Feb 26 2017 10:46 PM

ఢిల్లీ స్థాయిలో ‘అనంత’కు పేరు

కూడేరు : మండలంలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్‌సీసీ నగర్‌లో శిక్షణ పొందిన క్యాడెట్లు ఢిల్లీస్థాయిలో అనంతపురం జిల్లా పేరు నిలబెట్టారు. రిపబ్లిడ్‌ డే సందర్భంగా ప్ర«ధానమంత్రికి స్వాగతం పలికే ర్యాలీలో కర్నూలు గ్రూపునకు సంబంధించి 18 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. అందులో అనంతపురానికి చెందిన ఆంధ్ర గర్ల్స్‌ బెటాలియన్‌ నుంచి పాల్గొనడం గర్వించదగ్గ విషయం. ఈమేరకు ఆదివారం ఎన్‌సీసీ నగర్‌లో రిపబ్లిక్‌ డే ర్యాలీలో పాల్గొన్న క్యాడెట్లు ఎం.దర్శన, టీజే ప్రకృతి, టి.శ్రావణి, ఆశాలత, జిగ్నే సుల్తాన్, ఎం.శ్రావణి, నాగరాజు, నవీన్, మధుకుమార్, కాశీ విశ్వనాథ్, మురళీ కుమార్, హరీష్‌ను క్యాంప్‌ కమాండర్‌ మధుసూదన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో క్యాంప్‌ ఏఓ రేష్మి, అడ్జుడెంట్‌ కెప్టెన్‌ బీవీ రమణ నాయుడు, అధికారులు ప్రతిమ, శేఖర్‌రెడ్డి, గణేష్‌, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement