ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. తొలిమారు నంద్యాల నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్యాసింజర్రైలు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్కు చేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడి నుంచి కడపకు రైలు వెళుతుంది. జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరుకు ఇంత వరకు రైలు మార్గం లేదు. నిత్యం వ్యాపారులతోపాటు స్థానికులు ఎర్రగుంట్ల మీదుగా వెళుతున్నారు. గుంతకల్ రైల్వే డివిజన్లో అత్యధిక ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్లల్లో ఎర్రగుంట్ల ఒకటిగా ఉండటానికి ప్రధాన కారణం ప్రొద్దుటూరు ప్రాంతం ఉండటమే కారణం. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్కు ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా కల్పించారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ప్రభు, సీఎం చంద్రబాబు నాయుడులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రైలును ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి 5 గంటల ప్రాంతంలో రైలు ప్రొద్దుటూరుకు చేరనుంది. బుధవారం నుంచి యధావిధిగా ప్రతి రోజు నంద్యాల నుంచి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మీదుగా కడపకు చేరుతుంది.
ప్రముఖలకు ఆహ్వానం :
నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు స్థానికంగా ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, డాక్టర్ ఎంవి రమణారెడ్డి తదితరులకు ఆహ్వానం అందించారు. వీరంతా మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్కు రానున్నారు.
సర్వత్రా హర్షం:
ఎర్రగుంట్ల–నంద్యాల రైలు మార్గం పనులను వేగవంతం చేయాలని గతంలో కూడా పలు మార్లు ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన నేతలతోపాటు ప్రజలు సైతం ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఎట్టకేలకు పట్టణ వాసుల కోరిక నేరవేరతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పైగా ప్రధానంగా ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి వందల మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తుండటం గమనార్హం. ఈ రైలు మార్గం నూతన రాజధాని అమరావతికి ఉండటం విశేషం.
నెరవేరనున్న చిరకాల స్వప్నం
Published Mon, Aug 22 2016 11:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement